Pages

29, డిసెంబర్ 2016, గురువారం

ఇది ఒక అరుదైన సంఘటన..కానీ పట్టించుకున్న వారేరి...!!


ఈ నెల 27 వ తారీఖున పేపర్ న్యూస్ ప్రకారం  తెలంగాణా రాష్ట్రం లోని పెద్ద పల్లి ఇంకా మంచిర్యాల పరిసరాల్లో ఒక మంచి ఘటన జరిగింది.ఆ ముందు రోజు ఆయా ప్రాంతాల్లోని మతి స్థిమితం లేకుండా బజార్ల లో తిరిగే అభాగ్యుల్ని  అందర్నీ తీసుకొచ్చి వాళ్ళకి తైల సంస్కారం చేయించి,స్నానాలు చేయించి,నూతన వస్త్రాలు ధరింప జేసి ఒక హోం కి పంపించడం అనేది ఒక గొప్ప విషయం,అందునా పోలీసు అధికారులు ఈ పనికి పూనుకోవడం అభినందించదగ్గ అంశం.మనం ప్రతి రోజు ఇలాంటి వాళ్ళని,జంతు ప్రాయంగా జీవిస్తున్న మానవుల్ని చూసి వెళ్ళిపోతుంటాము,ఏమి చేయాలో తెలియక,ఎవరికి చెప్పాలో తెలియక.

ఎన్.జీ.వో. లు ఎంతోకొంత చేస్తున్నా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.ఈ సత్కార్యాన్ని ప్రారంభించిన రామగుండం పోలీస్ కమీషనర్ విక్రంజిత్ దుగ్గల్ గారిని మనసారా అభినందించాలి,ఎప్పుడూ సొల్లు రాజకీయాలే కాకుండా ఇలాంటి ఘటనలు జరిగినపుడు కవరేజీ ఇవ్వడం మీడియా ప్రతిష్టని కూడా పెంచుతుంది.  

1 కామెంట్‌:

  1. దుగ్గల్ గారు ఇంతకు మునుపు నల్గొండ లో చాలా మంచి పనులు చేసారు,యు ట్యూబ్ లో మన పొలిచ్
    చూడగలరని మనవి.

    రిప్లయితొలగించండి