Pages

11, డిసెంబర్ 2018, మంగళవారం

టి ఆర్ ఎస్ ని గెలిపించిన టి డి పి,కాంగ్రెస్ లు..!


వినడానికి అదోలా అనిపించవచ్చు గాని ఈ సారి జరిగింది అదే..!నేను ఓ సగటు పౌరుడిని.ఏ పార్టీ మీద వీర భక్తి గాని ఆరాధన గాని నాకు లేదు.నిజానికి ఈసారి తెరాస పార్టీ అధికారం లోకి వచ్చినా హంగ్ లాగా ప్రభుత్వం వస్తుందని అనుకున్నాను.కాని మహాకూటమి రూపం లో జతలు కట్టిన ఆయా పార్టీల్ని చూసి తెరాస మీద సగటు పౌరునికి ఒక జాలి లాంటిదే కలిగింది.ఇన్ని కలిసి ఓ పార్టీని టార్గెట్ చేస్తున్నాయంటే తప్పనిసరి గా కెసియార్ నాయకత్వం బలమైనదే అనే ఊహ జనం లో కలిగింది.ఇంకా తెలంగాణా సగటు పౌరుని విచాక్షణా శక్తి ని చంద్ర బాబు అండ్ కో తక్కువ అంచనా వేశారు.లేకపోతే సుహాసిని ని నిలబెట్టి హరి కృష్ణ మరణం సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలని చూడటం ఏమిటి..?పచ్చి చవకపారుతనం కాకపోతే..!వంశాల పేరు చెప్పి తొడలు గొట్టి బాలకృష్ణ లాంటి వాళ్ళు ఓట్లు అడిగితే అసలు వెయ్యాలి అనుకొనేవాడు కూడా వెయ్యడు.ఆంధ్రా లో ఉన్నంత కుల బానిసత్వం తెలంగాణా లో ఉండదు.అది గ్రహించలేక పోయారు.

ప్రస్తుతం తెదేపా తెలంగాణా లో ముగిసిన చరిత్ర.అది ఒప్పుకోనందుకే తెలంగాణా ప్రజలు ఘోరమైన ఓటమి ని చవి చూపించారు. కాంగ్రెస్ కి ఫైనాన్స్ చేసి మరీ తెలంగాణా లో తిష్ట వెయ్యాలని చూసే బాబు రేపు అధికారం లోకి కాంగ్రెస్ వచ్చినా ప్రాజెక్ట్ ల విషయం లో తెలంగాణా కి అన్యాయం చేస్తాడని ఒక మెసేజ్ పంపడం లో తెరాస సక్సెస్ అయింది.అది బాంబు లా పేలింది.పైగా తెలంగాణా లోని ప్రతి అభివృద్ది పని తానే చేశానని కాబట్టి నాకు రైట్ ఉంది చచ్చినట్టు ఓటు వేయండి అని ధోరణి లో మాట్లాడడం ఓటర్లకి చిర్రెత్తించింది.సోషల్ మీడియా అనేది రావడం తో సొంత గప్పాలు కొట్టే పత్రికల్ని ఇప్పుడు జనాలు నమ్మడం మానేశారు అనేది కూడా ఈ ఎన్నికల ద్వారా తెలిసింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి