Pages

31, మార్చి 2019, ఆదివారం

బాలకృష్ణ ప్రవర్తన ఇక మారదా..?



నటుడు , ప్రస్తుతం హిందూపూర్ నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ ఇటీవల మళ్ళీ ఓ ఫోటో జర్నలిస్ట్ పై విరుచుకుపడి చంపుతా,నరుకుతా బాంబులు వేయడం తెలుసు ..ఇంకా అది ఇది తెలుసు అంటూ వీరంగం వేయడం ,మళ్ళీ ఆ తర్వాత అలాటి వార్తలు రావడం దేన్ని తెలుపుతోంది తెలుగు ప్రజల బానిస మన్స్తత్వాన్ని  తెలుపుతోంది.లేకపోతే ఇండియా అంతా ఒక దారి లో పోతుంటే ఇక్కడ ఒక దారి.పట్టపగలు అడ్డూ అదుపు లేకుండా మాటాడ్డం దాన్ని అభిమానులు భరించి వెనకేసుకు రావడం ఇంత నీచ స్థితులు ఏ రాష్ట్రం లోనూ లేవు.ఇటీవల తమిళనాడు లో రాధా రవి అనే నటుడు నయనతార ని వ్యంగం గా మాటాడితే అక్కడి తారలు,నిర్మాతలు నోరు విప్పి ఖండించారు.ఇతర రంగాల నుంచి రాజకీయ ప్రపంపనలు కూడా కలిగి అతడిని డిఎం.కె పార్టీ నుంచి సైతం డిస్మిస్ చేశారు.

కాని మన దగ్గరా..నేను కడుపు అయినా చేయాలి,లేదా ముద్దు అయినా పెట్టాలి అంటు  ఒక స్టేజ్ మీద అంటే ఖండించిన పాపాన పోలేదు ఏ రాజకీయ పార్టీ.ఇలాంటి వారిని మొస్తూ పోటీ కి కూడా నిలబెడుతున్న పార్టీలు సిగ్గుపడాలి.అసలు ఈ స్థితి రావడానికి ప్రధాన కారణం ప్రధాన దిన పత్రికలు.కుల పక్షపాతం తో కునారిల్లుతూ  తెలుగు ప్రజల విలువలను,సంస్కృతిని అంతర్జాతీయ స్థాయి లో వలువలు ఊడదీస్తున్నాయి.ప్రతి అడ్డమైన వాటి మీద డిబేట్ లు పెట్టే చానళ్ళ కి గాని ,స్త్రీ సంఘాలకి గాని ఇలాంటి విష్యాలు కనిపించకపోవడం దారుణం.చరిత్ర లో హీన సంస్కృతికి సాక్ష్యాలు గా ఇలాంటి విషయాలు నిలబడిపోతాయి.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి