Pages

22, ఏప్రిల్ 2019, సోమవారం

ఇంటర్మీడియట్ ఫలితాలు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యమా..?


ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో బయటబడిన తీవ్ర తప్పిదాలు ఇంతవరకు ఇంటర్ బోర్డ్ చరిత్ర లో ఎప్పుడూ జరగలేదు.హాజరయి పరీక్ష రాసిన పిల్లలు అబ్సెంట్ గా అయినట్లు రావడం,ముందు సున్న వచ్చిన విధ్యార్తి రీ వేల్యూషన్ పెట్టించుకుంటే 99 మార్కులు రావడం ఇంకా సబ్జెక్ట్ ల లో నూ,మార్కుల లోను అవక తవకలు గా మార్కుల మెమోల్లో రావడం ఇది అంతా గతం లో చాలా చాలా కొద్ది సంఘటనలు గా జరిగేవి.అయితే ఈసారి మాత్రం పెద్ద ఎత్తున పొరపాట్లు జరగడం మాత్రం చాలా ప్రస్ఫుటం గా కనిపిస్తోంది.  అనేకమంది పిల్లలు ఆత్మహత్య లు చేసుకోవడం హృదయవిదారం గా ఉంది.

ఎందుకని ఈ సారి ఇంత ఘోరమైన పరిస్థితి నెలకొంది..? విద్యా శాఖ యొక్క ఘోర వైఫల్యం అని ఎవరైనా చెప్పగలరు.ఇకనైనా వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.ఎంతో జాగరూకతో కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న తెరాస ప్రభుత్వం  మేల్కొని ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి.ప్రజల్లో నమ్మకం కల్పించాలి.మితిమీరిన ఆత్మవిశ్వాసం తోనే వైఎసార్ ,ఎన్ టీఆర్ లాంటి జనాకర్షణ కలిగిన నాయకులు సైతం దెబ్బతిన్నారు.వాటినుంచి ప్రస్తుత నేతలు గుణపాఠం నేర్చుకోవాలి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి