Pages

23, మే 2019, గురువారం

తెలంగాణా లో బి.జె.పి. నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకోవడం దేనికి సూచన..?

తెలంగాణా లో బి.జె.పి. నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకోవడం దేనికి సూచన..? నిస్సందేహం గా కాంగ్రెస్ మిగిల్చిన ఓ ఖాళీ ని కొత్త గా బి.జె.పి పూరించే దిశ గా కదులుతున్నట్లు చెప్పుకోవాలి.ఆంద్ర ప్రాంతం తో పోలిస్తే తెలంగాణా లో బి.జె.పి కి ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంది.ఎక్కడైతే ముస్లిం వాతావరణం ఉంటుందో అక్కడ రకరకాల జిమ్మిక్కులు తో బి.జె.పి.కూడా దానికి అంటూ ఒక స్థానం ని ఏర్పరుచుకుంటుంది.హిందువులా..బొందువులా ..అంటూ ముఖ్యమంత్రి వదిలిన డైలాగులు బయటకి దీనిదేముంది లే అనుకోవచ్చు గాని మెజారిటీ మతస్తుల్లో ..వారి సబ్ కాన్షస్ లో వ్యతిరేక ప్రభవం చూపింది.పైగా రజాకార్ల టైం నాటి దౌర్జన్యాలు తెలంగాణా ప్రజల్లో పూర్తిగా చెరిగిపోయాయి అనుకుంటే పొరబాటు. అలాంటి వాటిని ఎలా క్యాష్ చేసుకోవాలో బి.జె.పి కి.వెన్న తో పెట్టిన విద్య.

ప్రజాస్వామ్య శక్తులు అనే పేరిట కమ్యూనిష్టులు గాని మిగతా అభ్యుదయ వాదులు గాని హిందూ తీవ్ర వాదం గురించి మాటాడినట్లు ఇస్లాం తీవ్రవాదం గురించి మాట్లాడరు.పైగా డొంక తిరుగుడు సమాధానాలతో సమర్దించే విధంగా మాటాడుతారు.ఇలాంటివి తటస్థం గా ఉన్న వోటర్లను బి.జె.పి. వేపు గా మళ్ళిస్తాయి.చూడబోతే బి.జె.పి కాలూనడానికి టి.ఆర్.ఎస్. కూడా పరోక్షం గా సహకరిస్తున్నదా అనే అనుమానం కలగక మానదు.ప్రస్తుత సరళిని చూస్తే అలా అనిపించక మానదు.అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటారు.తమ ప్రయోజనాల కోసం.ఏ పార్టీ ని అనడానికి లేదు.ఎవరు ఎందుకు ఎప్పుడు ఎవరితో కలుస్తారో చెప్పలేని స్థితి. 


     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి