Pages

15, జులై 2017, శనివారం

ముఖ్యంగా డ్రగ్స్ వాడుతూ ఉండేవాళ్ళ కళ్ళు తెలిసిపోతూనే


డ్రగ్స్ ఉదంతం తెలుగు సినిమా ప్రపంచాన్ని కుదిపివేస్తోంది.కొన్ని వేల మంది పిల్లలు దీనికి అలవాటు పడినట్లు బయటకి వచ్చింది.ఆ న్యూస్ కంటే సినిమా వాళ్ళ డ్రగ్ వాడకం ప్రకంపనలు రేపుతోంది.అదే రంగుల లోకానికి ఉన్న ప్రత్యేకత.ఇప్పుడు బయటకి వచ్చిన సినిమా వాళ్ళ పేర్లు చాలా మటుకు ఊహించినవే. కొద్దిగా జనరల్ నాలెడ్జ్ ఉంటే ఆ వ్యక్తుల్ని గుర్తించవచ్చు.ముఖ్యంగా డ్రగ్స్ వాడుతూ ఉండేవాళ్ళ కళ్ళు తెలిసిపోతూనే ఉంటాయి. కంటిలో తెల్ల గుడ్డు అనేది మిగతా వాళ్ళతో పోలిస్తే పత్తి పువ్వు లాగా మితిమీరిన తెల్లగా కనిపిస్తుంది.దానివల్ల కళ్ళు చాలా బ్రైట్ గా ఆకర్షణీయం గా కొట్టొచ్చినట్లు కనబడతాయి.మొహం ఉబ్బినట్లు గా ఒక గ్లామర్ తో ఉంటుంది.అయితే కొన్ని ఏళ్ళు పాటు వాడ్తూ పోయే వాళ్ళకి నరాల మీద విపరీత ప్రభావం చూపిస్తాయి.


మనకి ఇపుడు బయట పడింది గాని ఆ బాలీవుడ్ లో ఈ ట్రెండ్ బాగా వేళ్ళూనుకుంది.ముఖ్యంగా ఉత్తరాది లో పంజాబ్ ఇంక కొన్ని రాష్ట్రాల్లో ఈ డ్రగ్ కల్చర్ మితి మీరి ఉంది.రైతులు తమ పొలాల్లొ పనిచేసే కూలీలకి ఇవి సరఫరా చేస్తుంటారు.శ్రమ తెలియకుండా పనిచెయడానికి.పెద్ద చేపలు ఎప్పుడూ ఏదోలా తప్పించుకుంటూనే ఉంటారు.ధోరణి చూస్తుంటే మన తెలుగు ఇండ్ర్రస్ట్రీ లో అదే జరుగుతున్నట్లు అనుమానం వస్తోంది. అయినా వేచి చూద్దాము ఏమి జరగనున్నదో..!   

27, మే 2017, శనివారం

"బాహుబలి-2" సినిమా పై నా రివ్యూ...!



అందరూ బాగా ఉంది...అంటూ ఉంటే ఈ మధ్యే చూశాను.ముఖ్యంగా గ్రాఫిక్స్ సూపర్ అని మారుమోగుతుండటం తెలిసిందే గా..! కాని ప్రచారం జరిగినంత ఇది గా అయితే నాకు అనిపించలేదు.కధ వండిన తీరు లో గాని,గ్రాఫిక్కుల వరసలో గాని అనేక కాపీలు తోచి ఇదేమి కిచిడీ సినిమా రా బాబూ అనిపించింది.ఆ శివగామి సభ లో సిం హాసనం ఇరు వైపులా నిలబడినట్లుగా ఉండే పేద్ద గోల్డెన్ శిల్పాలు ..అదే కత్తి పట్టుకొని నిలబడ్డవి..అవి ఆస్కార్ అవార్డ్ లోగోలు కావా..?కాకపోతే ఇంతెత్తు ఉన్నట్లు చూపారు.రోమన్ల ఆర్చిటెక్చర్ లో ఉన్నట్లుగా భవన సముదాయాలు,ఇంకా రాజుల కత్తులు,రధాలు అన్నే వాటిల్లోనుంచి తీసుకున్నవే..ఇది ఇండియా రాజుల కధ నా..రోమన్లదా..?ఇక ఎక్కడ చూసినా పిచ్చ బంగారం లా విగ్రహాలు,తాపడాలు..కృతకంగా ఉన్నాయి.

 కోనన్  ద బార్బేరియన్ సినిమా లోనుంచి కొన్ని యుద్ధ సన్నివేశాలు లేపేశారు.కట్టప్ప బాహుబలిని నమ్మించి చంపడం కాన్సెప్ట్ ఒక సేక్స్పియర్ నాటకం లో నుంచి లేపేసినది.గ్రాఫిక్స్ అన్నీ చాలా కృత్రిమంగా ఉన్నాయి.చైనా గోడని కూడా గ్రాఫిక్స్ లో వాడేశారు.ఇక భవనాలు...యుద్ధ సన్నివేశాలు అనేక హాలివుడ్ సినిమాల్లో చూసిన వాటికి నకళ్ళే.ఇంత ధనం పెట్టి తీసినపుడు ఏదైనా చారిత్రక సినిమా తీసినా బాగుండును.దుస్తులు,భవనాలు,శిల్ప చాతుర్యాలు..ఇలాంటివి అన్నీ చూసి ..అసలు ఇది ఏ దేశపు సంస్కృతికి చెందిన సినిమా అనిపించక మానదు.

150 నుంచి 200 దాకా టికెట్లు పెంచి అన్ని కోట్లు వసూలు చేసింది అని చెప్పుకోడం అతి తెలివి.ఇదొక తొండి ఆట.ఈ రికార్డుల్లో పస లేదు.ఎవరు ఏమనుకున్నా నాకు అనిపించింది ఇదే. ఈ కాడికి హాలివుడ్ కూడా తీయలేని సినిమా అని గప్పాలు కొట్టుకోవడం హాస్యాస్పదం.అసలు సినిమా నిర్మాణం లో అంత ఖర్చు జరిగిందా అనేది కూడా ఒక సందేహమే.

28, ఏప్రిల్ 2017, శుక్రవారం

దాదా ఫాల్కె అవార్డ్ వచ్చిన సందర్భం లో అబాసు పాలు చేయ తగునా..?



సీనియర్ తెలుగు సినీ దర్శకులు కె.విశ్వనాద్ కి దాదా ఫాల్కె అవార్డ్ కేంద్రం ప్రకటించడం తో తెలుగులు చక్కగా తమ భాష వ్యక్తి గౌరవింపబడ్డాడని సంతోషిస్తారేమోనని ఆశపడడం నిరాశే అయింది.దీని లోను అనేక రంద్రాలు వెదికి ఆయన తిరోగమన భావ సినిమాలు తీశారని కొందరు ఆరోపణలకి దిగడం విడ్డూరం. అసలు సినిమా యొక్క ముఖ్య ఉద్దేశ్యం వినోదం..ఆ తర్వాతే ఏదైనా..!చాలా మంది లాగా బూతు డైలాగు ల తో గాని,మితిమీరిన శృంగారం తో గాని ఆయన సినిమాలు తీయలేదు.చక్కని సాహిత్యం,సంగీతం ఉన్న పాటలు పదికాలాలు పాటు పాడుకునేలా సినిమాలు తీశారు.

సప్తపది ,శంకరాభరణం  ఇంకా ఇలాంటి ఎన్నో సినిమాల్లో అంతర్లీనంగా మూఢవిశ్వాసాల్ని ఎండగట్టారు. కొండొకచో ఆయన వర్గాన్ని కాస్త గౌరవ భావం కలిగేలా పైకి ఎత్తి ఉండవచ్చుగాక..దానివల్ల ఎవరికైనా వచ్చిన నష్టం ఏమిటి..? అంత దాక ఎందుకు..రామా నాయుడు కి గతం లో ఇదే అవార్డ్ ఇచ్చారు.ఆయన తీసిన గొప్ప కళాఖండాలు ఏమిటి...ఫక్తు కమర్షియల్ సినిమాలే ఎన్ని తీసినా..అక్కినేని కూడా అంతే...తెలుగు సినిమా ఒక మూస లో పడి కొట్టుకోని పోవడానికి ముఖ్యంగా వీరే కారణం..కాదా..? కాని అప్పుడు కనిపించని అబ్జక్షన్లు ఇప్పుడు కొంతమందికి కనిపించడం వింత ధోరణి కాకా మరేమిటి..? 

23, ఏప్రిల్ 2017, ఆదివారం

ఇంత హిపోక్రసీ ఏ రాష్ట్రం లో నూ ఉండదు.ఇది ఇంచుమించు అన్ని రంగాల వారి లోనూ కనబడుతుంది.

ఇప్పుడే ఇవేళ 4.40 కి జి తెలుగులో ఓ ప్రోగ్రాం పేరు అప్సర అనుకుంటా చూస్తుంటే ఇది రాయాలనిపించింది. దానిలో పేరు ఎందుకులే గాని ప్రముఖ హైదరాబాదీ మహిళా  క్రికెకటర్ కి ఏదో అవార్డ్ ఇచ్చారు.ఆ తర్వాత ఆంగ్లం లో ఏదో మాట్లాడుతుండగా ..ఓ ఏంఖర్ అందుకొని ..మీకు తెలుగు వచ్చు గదా అని అనగా..కొంచెం..కొంచెం...అని వచ్చీ రానట్లుగా చెప్పింది.ఎప్పటినుంచో రాయాలని అనుకున్నది ఇప్పుడు పెల్లుబికింది.అది ఏమిటో గాని మీరు..ఒక్క హైదరాబాద్ లోనో ..తెలుగు రాష్ట్రం లోనో నివసిస్తే ఏమీ అనిపించదేమో గాని ఇలాంటి నయా యూత్ కి ఏ భాష మీద సరైన కమాండ్ ఉండదు.

ఇంగ్లీష్ గావచ్చు..హిందీ గావచ్చు..ఉర్దూ గాని...ఏదో పైపైన మాట్లాడటానికే గాని ఏ భాషా ఒక వింద్వాన్సుని మెప్పించే స్థాయికి రాదు.అంత గాకపోయినా కాస్త అనేక పుస్తకాలు చదివి Wits తో మాట్లాడే తెలివి శూన్యం.ఒక మాదిరి తెలివి ఉన్నవారిని కూడా మెప్పించే విధంగా మాట్లాడలేరు. ఇది ముఖ్యంగా హైదరాబాదీ యూత్ లోనే బాగా కనబడుతుంది.బెంగుళూర్,చెన్నై నగరాల్లోని యూత్ అలరించే విధంగా ..భావాన్ని వివరించే విధంగా మాట్లాడగలరు.అది ఎందుకనో గాని..తెలుగు రానట్లుగా..ఇంగ్లీష్ లో మాట్లాడబోతారు..దానిలోనూ ఒక నిజాయితీ తో కూడిన కమాండ్ ఉండదు.అంతా అరకొర నే.

చివరకి అటు ఇటు చేసి ఏ భాష లోనూ భావాన్ని సరిగా వ్యక్తీకరించలేరు.ఇంత హిపోక్రసీ ఏ రాష్ట్రం లో నూ ఉండదు.ఇది ఇంచుమించు అన్ని రంగాల వారి లోనూ కనబడుతుంది.

23, మార్చి 2017, గురువారం

వీళ్ళ దోపిడికి అంతు అనేది లేదా..?


బ్యాంక్ లు ఇటీవల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కస్టమర్ల ని నిలువు దోపిడి చేస్తున్నట్లుగా అర్ధమవుతుంది.కనీస మొత్తం లేకపోతే బాదుడు,రెండు లక్షలు పైన వ్యవహారం చేస్తే బాదుడు,ATM ల లో మూడు సార్లు వారానికి మించి తీస్తే బాదుడు,ఇలా ప్రతి దానికి బాదుతూ జనాల్ని చికాకు చేస్తూన్నాయి.చాలా ప్రముఖ బ్యాంక్ ల ATM లు పేరు కే తప్ప ఎప్పుడు డబ్బు డ్రా చేద్దామని వెళ్ళినా పని చేయవు.అప్పుడు కస్టమర్ ఎన్యో నిరాశ కి లోనవుతాడు.చాలా అర్జంట్ పనులు కూడా ఆగిపోతుంటాఇ.మరి అలాంటప్పుడు మనం అంతా కలిసి ఒక డిమాండ్ ఎందుకు చేయకూడదు.మూడు సార్లు ATM లు ఈ విధన్ గా ఫేలయితే దానికి తగిన నగదు మూల్యం వడ్డీ రూపం లో కస్టమర్ కి ఇవ్వాలి లేదా మరో రకంగా పూరించాలి.

కోటీశ్వరుల  రుణాలను ఎంతో ఉదారంగా వదిలేస్తూ ..దానికి రకరకాల ముద్దు పేర్లు పెట్టి ..ఆ భారాన్ని సామాన్య జనాల మీద తొయ్యడం ఎంత మాత్రం భావ్యం కాదు.ప్రజలంతా అన్ని రకాల భేషజాల్ని వదిలి బ్యాంక్ ల దోపిడి మీద పోరాడవలసిన అవసరం ఈరోజు ఏర్పడింది.

5, మార్చి 2017, ఆదివారం

"ఘాజీ" సినిమా రివ్యూ



ఒక చక్కని విలక్షణమైన సినిమా.సినిమా లో ఎక్కడా పాటలు లేవు.పిచ్చి హాస్యం లేదు.ఒకటే.పాకిస్తానీ సబ్ మరైన్ ఘాజీ ని వెంటాడి ఫినిష్ చూపించారు సినిమా లో.కాని ఎక్కడా బోరు లేదు.ఒక కొత్త దనం చూపించాడు.ఇంత దాకా మిలిటరీ అంటే ఆర్మీ అన్నట్లు గా చూపించారు.కాని సముద్ర గర్భం లో సాగే యుద్ధం ని ఈసారి చూయించారు.అందుకు అభినందించవలసిందే.దానిలో సాగే డ్రామా..అదీ మరీ బోరు కొట్టదు.అప్పుడప్పుడు ఇలాంటి వాటిని కూడా జనాలు ఆదరించాలి లేదా  పిల్లి బిత్తిరి మాస్ సినిమాలే తప్ప ఇంకొకటి తెలుగు వాళ్ళకి తెలియవు అని ఇండియా అంతా అనుకునే అవకాశం ఉంది.సంకల్ప్ రెడ్డి మూడు భాషల్లో  తీయడం మంచిది అయింది.సినిమా మొత్తానికి దర్శకుని ప్రతిభ కి అభినందించవలసిందె.కె.కె.మీనన్,రాణా ఇంకా అంతా అలరించారు.

సముద్రం లోపల ఇలాంటి ఓ ప్రపంచం ఉంటుంది..అక్కడ ఇలాంటివి జరుగుతాయి అని మొదటి సారి గా మాస్ వర్గాలు కూడా తెలుసుకున్నారు అని చెప్పాలి. మొరటు సినిమాలే కాక ఇలాంటి సినిమాలు తీస్తుంటే తెలుగు ప్రజల తెలివి కూడా ఇతరులకి తెలుస్తుంది.

6, ఫిబ్రవరి 2017, సోమవారం

ఏమిటో ఈ వంశ గా ధలు..ఎవడు నమ్ముతాడని వీళ్ళ పిచ్చి గాని...


ఈ మధ్య బ్లాగు ల్లో తగ్గింది గాని  ఫేస్ బుక్ లో మరీ రెచ్చిపోయి విజృంభణ చేస్తున్నారు.అదే ..చారిత్రక పురుషుల్ని ఇంకా ఆయా వంశ చరిత్రల్ని తమ కులం పాలు చేసుకోడానికి చేసే ప్రయత్నాలు.ఇటీవల ఒకాయన శ్రీకృస్ణ దేయరాయలు ని తమ కులానికి కలపాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు,ఆ ఆధారాలు ఈ ఆధారాలు అని.అవి నిజంగా పరిశీలిస్తే సరిగా కనిపించి చావవు ..ఒకటైతే  కనిపించినా ఏ కులానికి చెందినట్లు ఎక్కడా ఉండవు. అది వారికీ తెలుసు.కాని ఘనత వహించిన తమ కులం దానికి చెందాలనేది ఈ యన పట్టుదల లా ఉందే అనిపిస్తుంది.అసలు ఇప్పుడు ఉన్నంత సాలిడ్ గా కులం గతం లో లేదు.అవసరాన్ని బట్టి రాజులు బలవంతులతో అన్ని రకాల సర్దుబాట్లు చేసుకునేవారు.ఎవరకి అంకితే వారిదే రాజ్యం ఆ రోజున.సూర్య చంద్ర వంశాలు కి కలుపుతూ రాయమని చెబితే రాసే పండితులు ఎందరో ఆ రోజున. గతం లో కాకతీయులకి కలుపుతూ భజనలు వాయించుకున్న వీరు ప్రస్తుతం రాయలు కి కలుపుకుంటున్నారు.


మళ్ళీ పైగా పరిశోధనలు చట్టుబండలు అంటూ ఏవో ఉదహరిస్తుంటారు.అసలు ఈ ప్రజాస్వామ్య యుగం లో ఇంకా కులం పేరు తో గొప్పలు పోవడం,దానికి సొల్లు ఉదాహరణలు చూపుతూ రాసుకోవడం అది వారి పైత్యానికి నిదర్శనం.పైగా ఈ రాసే వాళ్ళంతా చదువుకొని ఉద్యోగాలు వెలగబెట్టినవాళ్ళే.మహమ్మదీయులు లేదా ఇతర విదేశీయులు ఇతర దేశాల నుంచి  వచ్చి ఇక్కడ భూముల్ని ఆక్రమించి రాజ్యాల్ని ఆక్రమించినప్పుడు ఘనత  వహించిన ఈ కులాల వాళ్ళందరూ వారి మోచేతి నీళ్ళు తాగి జీవించిన వాళ్ళే.కాని వీరి గొప్పదనం ఎందుకు పనికి వస్తుంది అంటే సాటి హిందూ మతం లోని బడుగు కులాల దగ్గర చూపించడానికి పనికి వస్తుంది.చరిత్ర చదివితే తెలిసే సత్యాలు ఇవి.అందుకే కొంత మందికి చరిత్ర అంటే ఇష్టం ఉండదు.