Pages

6, ఫిబ్రవరి 2017, సోమవారం

ఏమిటో ఈ వంశ గా ధలు..ఎవడు నమ్ముతాడని వీళ్ళ పిచ్చి గాని...


ఈ మధ్య బ్లాగు ల్లో తగ్గింది గాని  ఫేస్ బుక్ లో మరీ రెచ్చిపోయి విజృంభణ చేస్తున్నారు.అదే ..చారిత్రక పురుషుల్ని ఇంకా ఆయా వంశ చరిత్రల్ని తమ కులం పాలు చేసుకోడానికి చేసే ప్రయత్నాలు.ఇటీవల ఒకాయన శ్రీకృస్ణ దేయరాయలు ని తమ కులానికి కలపాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు,ఆ ఆధారాలు ఈ ఆధారాలు అని.అవి నిజంగా పరిశీలిస్తే సరిగా కనిపించి చావవు ..ఒకటైతే  కనిపించినా ఏ కులానికి చెందినట్లు ఎక్కడా ఉండవు. అది వారికీ తెలుసు.కాని ఘనత వహించిన తమ కులం దానికి చెందాలనేది ఈ యన పట్టుదల లా ఉందే అనిపిస్తుంది.అసలు ఇప్పుడు ఉన్నంత సాలిడ్ గా కులం గతం లో లేదు.అవసరాన్ని బట్టి రాజులు బలవంతులతో అన్ని రకాల సర్దుబాట్లు చేసుకునేవారు.ఎవరకి అంకితే వారిదే రాజ్యం ఆ రోజున.సూర్య చంద్ర వంశాలు కి కలుపుతూ రాయమని చెబితే రాసే పండితులు ఎందరో ఆ రోజున. గతం లో కాకతీయులకి కలుపుతూ భజనలు వాయించుకున్న వీరు ప్రస్తుతం రాయలు కి కలుపుకుంటున్నారు.


మళ్ళీ పైగా పరిశోధనలు చట్టుబండలు అంటూ ఏవో ఉదహరిస్తుంటారు.అసలు ఈ ప్రజాస్వామ్య యుగం లో ఇంకా కులం పేరు తో గొప్పలు పోవడం,దానికి సొల్లు ఉదాహరణలు చూపుతూ రాసుకోవడం అది వారి పైత్యానికి నిదర్శనం.పైగా ఈ రాసే వాళ్ళంతా చదువుకొని ఉద్యోగాలు వెలగబెట్టినవాళ్ళే.మహమ్మదీయులు లేదా ఇతర విదేశీయులు ఇతర దేశాల నుంచి  వచ్చి ఇక్కడ భూముల్ని ఆక్రమించి రాజ్యాల్ని ఆక్రమించినప్పుడు ఘనత  వహించిన ఈ కులాల వాళ్ళందరూ వారి మోచేతి నీళ్ళు తాగి జీవించిన వాళ్ళే.కాని వీరి గొప్పదనం ఎందుకు పనికి వస్తుంది అంటే సాటి హిందూ మతం లోని బడుగు కులాల దగ్గర చూపించడానికి పనికి వస్తుంది.చరిత్ర చదివితే తెలిసే సత్యాలు ఇవి.అందుకే కొంత మందికి చరిత్ర అంటే ఇష్టం ఉండదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి