యూదులు జీసస్ ని ఎందుకు అంతిమ ప్రవక్త గా అంగీకరించలేదు? ప్రపంచం లోని అనేక దేశాల ప్రజలు ఆయన్ని అనుసరించారు. అంగీకరించారు. కాని ఈరోజుకీ యూదులు ఆయన్ని మెస్సియ గా అంగీకరించలేదు.దానికి కారణాలు చాలా బలమైనవి. అసలు యూదుల యొక్క పవిత్ర గ్రంథం ఏమిటి,అనే సందేహం ఎవరికైనా వస్తుంది.
నిజానికి మూడు ప్రధాన గ్రంథాలు ఉన్నాయి. తోరా,తనక్,తాల్ముద్ ఈ మూడింటిలో చాలా ప్రాచీన చరిత్ర నిక్షిప్తం కాబడి ఉంది.యూదులు మత విశ్వాసాలు,న్యాయ సూత్రాలు,ఇంకా అనేక మంది ప్రవక్తలు చెప్పిన అంశాలు ఉంటాయి.
మనం ఈ రోజున చూసే బైబిల్ లోని జెనిసిస్,ఎక్సొడస్,లెవిటస్,నంబెర్స్,డ్యుటొరోనమి ఇవన్నీ తోరా లోని ముందు భాగం లో ఉన్నాయి.సృష్టి క్రమం,మోజెస్ చెప్పిన న్యాయస్మృతులు ,యూదుల యొక్క చరిత్ర వీటిలో ఉన్నాయి.
యూదులు జీసస్ ని యెషుహ నజ్రి అని తమ గ్రంథాల్లో ప్రస్తావించారు. వారి లేఖనాల్లో తమకి విముక్తి కలిగించే మెస్సియ మూడు వాగ్ధానాల్ని నెరవేర్చుతాడని రాశారు. జెరుసలేం లో మూడవ ఆలయాన్ని నిర్మించడం,చెల్లా చెదురైన యూదు జాతీయుల్ని అందర్నీ ఇజ్రాయెల్ కి చేర్చడం,అంతటా శాంతి నెలకొల్పడం ఈ మూడింటిని జీసస్ తన జీవిత కాలం లో చేయలేకపోవడం వల్ల యూదు మత పెద్దలు ఆయన్ని మెస్సియ గా పరిగణించలేదు.
యూదుల గ్రంథాలు చాలా ప్రాచీనమైనవి. కొన్నిటిని మూడు వేల ఏళ్ళ క్రితం రాశారు. వీటిలో ఆధ్యాత్మిక అంశాలు మాత్రమే గాక చారిత్రక అంశాల్ని కూడా గమనించవచ్చు. తండ్రి,కుమార,పరిశుద్ధాత్మ అనే ట్రినిటీ కాన్సెప్ట్ ని యూదులు అంగీకరించలేదు. యూదుల్లో జన్మించిన అనేక మంది ప్రవక్తల్లో జీసస్ ని ఒకరిగా అయితే గౌరవించారు.
యూదులకి ఎన్నో తరాల నుంచి వచ్చే సబ్బాత్ నియమాల్ని జీసస్ ఉల్లంఘించడం కూడా ఆ పెద్దలకి కోపం వచ్చింది.
యూదుల ప్రార్ధనా మందిరాల్ని సినగోగ్ లు అంటారు.రోజుకి మూడు సార్లు అంటే ఉదయం,మధ్యానం,రాత్రి తప్పకుండా ప్రార్ధన చేయాలి.వైన్ ని గాని, ఆహారాన్ని గాని యూదులు కాకుండా వేరే వాళ్ళు చేస్తే దాన్ని వారు స్వీకరించరు.
దాదాపు 100 కి పైగా దేశాల్లో యూదులు నివసిస్తున్నారు. అత్యంత ఎక్కువ గా ఇజ్రాయెల్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిదే. ఆ తర్వాత అమెరికా,కెనడా,బ్రిటన్,ఆస్ట్రేలియా ఇత్యాది దేశాల్లో ఉన్నారు. అనేకమంది యూదులు ప్రపంచ కుబేరుల జాబితా లో మనకి కనబడతారు.
గూగుల్ అధిపతి లారీ పేజ్, ఫేస్ బుక్,ఇన్స్టాగ్రాం ల సి.ఇ.వో. మార్క్ జూకర్బెర్గ్,ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమందినో చెప్పాలి. టాప్ టెన్ ప్రపంచ కుబేరుల్లో అయిదుగురు యూదులే! హాలీవుడ్ లో స్పీల్ బర్గ్ నుంచి పెద్ద స్టూడియో అధినేతల దాకా యూదులు కనిపిస్తారు.
యూదులు స్వతహగా చాలా పొదుపరులు. వ్యాపార దృక్పథం గలవారు. సంఖ్యా పరంగా తక్కువ ఉన్నప్పటికీ తాము ఉన్న దేశాల్ని శాసించే స్థితి లో ఉంటారు.హిట్లర్ లాంటి వాళ్ళకి ఇది నచ్చకనే ఎక్కడ కనబడితే అక్కడ ఊచకోత కోయించాడు.
ఆధునిక యుదుల జీవిత చిత్రణ ని అనేకమంది ఇంగ్లీష్ ఫిక్షన్ రచయితల పుస్తకాల్లో చదవవచ్చు. హెరాల్డ్ రాబిన్స్ తాను రాసిన 25 నవలల్లోనూ యూదుల పాత్రల్ని ఎక్కడో ఓ చోట తప్పకుండా ప్రవేశపెడతాడు.
అమెరికాలోని యూదుల రకరకాల గాధల్ని మనం అర్థం చేసుకోవచ్చు.ద డ్రీం మర్చంట్స్ (1949) అనే నవల లో చిన్న పట్టణాల్లో మొబైల్ సినిమా వ్యాన్ ని నడుపుకునే ఇద్దరు సోదరులు ఆ తర్వాత హాలీవుడ్ లో ప్రవేశించి ఏ విధంగా స్టూడియో అధినేతలుగా ఎదిగారు అనేది చెబుతాడు.
కార్పెట్ బేగర్స్ (1961) ,79 పార్క్ అవెన్యూ,ద అడ్వెంచరర్స్,గుడ్ బై జానెట్, ఇన్ హెరిటర్స్, రైడర్స్,ఇలా చాలా నవలల్లో యూదు వ్యాపారస్తుల కుటుంబాల్ని మనం పరిశీలించవచ్చు.
శాస్త్రవేత్తలు,రచయితలు,వివిధ కళాకారులు,ఇతర రంగాల్లోని సంపన్నులు వీళ్ళలో యూదులు లెక్కకు మిక్కిలిగా కనపడతారు.
ఫ్రాంజ్ కాఫ్కా,బాషెవిస్ సింగర్ ,బెర్నార్డ్ మాల్ముద్,ఇలా రచయితల్లో ఎంతో మందిని చెప్పవచ్చు. అలాగే నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తల్లో 20 శాతం మంది యూదులు ఉంటారు.అల్బర్ట్ ఐన్ స్టీన్,షోపెన్ హోవర్ లాంటివాళ్ళు ప్రసిద్ధులు.
యూదు మతం లోకి ఎవరైనా కన్వర్ట్ కావడం కుదురుతుందా అని సందేహం రావచ్చు. ఆ వీలు ఉన్నప్పటికీ అది చాలా కష్టమైన ప్రక్రియ.
దాదాపు సంవత్సరం లేదా అంతకి పైబడిన సమయం తీసుకుంటుంది. యూదు మతానికి చెందిన అన్నీ పవిత్ర గ్రంథాల్ని,చరిత్ర ని అధ్యయనం చేయాలి. ఆ తర్వాత ఓ ఏడాదికి యూదు మత పెద్దలు పరీక్షలు పెడతారు.
అది కూడా పాస్ అయితే ఆ తర్వాత తంతు కూడా చాలా కాలం తీసుకుంటుంది. కాబట్టి అన్ని కష్టాలు పడి ఈరోజుల్లో ఎవరు ఆ మతం లోకి మారతారు? ఇకపోతే మన దేశం లోని హిమాచల్ ప్రదేశ్ కి ఇజ్రాయెల్ వారు ఎక్కువ గా వస్తున్నట్లు తెలుస్తోంది.
కుల్లూ లోయ లోని కాసోల్,ధర్మశాల లో మినీ ఇజ్రాయెల్ వాతావరణం ఉన్నది. హిబ్రూ భాషలోనే అక్కడి అన్ని రకాల బోర్డులు కానవస్తాయి.
--- మూర్తి కెవివిఎస్
.jpg)


