Pages

18, డిసెంబర్ 2025, గురువారం

ఎంబసీ, హై కమీషన్, కాన్సులేట్ వీటి మధ్య తేడా ఏమిటి ?


మనం తరచుగా ఎంబసీ, హై కమీషన్ ఇంకా కాన్సులేట్ కార్యాలయం అనే మాటల్ని వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా విదేశాల్లో ఉండే రాయబార కార్యాలయాలకి ఉండే పేర్లు అని మనం భావిస్తాం. మరి అయితే వాటి మూడిటి మధ్య తేడా ఏమీ లేదా అంటే ఉన్నది. కామన్ వెల్త్ దేశాల్లో ఉండే మన రాయబార కార్యాలయాల్ని ఎంబసీ అని పిలిస్తాము. అలాగే నాన్ కామన్ వెల్త్ దేశాల్లో ఉండే వాటిని హై కమీషన్ అని వ్యవహరిస్తాము. పై రెండు కార్యాలయాలు చేసే పని ఒకటే.వివిధ రంగాల్లో మన దేశ ప్రయోజనాల్ని ఇతర దేశాల్లో సమ్రక్షించడం, ఆయా దేశాల్లో మన దేశ పౌరుల కి అవసరం ఏర్పడినపుడు సాయం చేయడం, ఇతర దేశాలతో అనుసంధానం గా పని చేయడం ఇలాంటివి చేస్తుంటాయి.

ఇక కాన్సులేట్ కార్యాలయం అంటే దిగువ స్థాయి రాయబార కార్యాలయాలు వంటివి. ఉదాహరణకి అమెరికా కి న్యూ ఢిల్లీ లోని చాణక్యపురి లో ఎంబసీ ఉన్నది. దానికి అనుసంధానంగా హైదరా బాద్, చెన్నై,ముంబాయ్,కోల్కతా నగరాల్లో కూడా కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయి.పాస్ పోర్ట్,వీసాలు,విదేశీ వ్యాపార కార్యకలాపాలు ఇంకా రకరకాల విషయాలకి సంబంధించి వత్తిడిని తట్టుకుని పనిచేయడానికి రాజధాని నగరాలు కానప్పటికీ ఆయా ముఖ్య నగరాల్లో ఆ బ్రాంచ్ ఆఫీస్ లు లాంటివి పెట్టారన్నమాట. అయితే ప్రతి దేశానికి ఒకటి కంటే ఎక్కువ ఎంబసీ లు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు.

నిజానికి మన దేశానికి ప్రపంచం లోని అన్ని దేశాల్లో రాయబార కార్యాలయాలు లేవు. కేవలం 150 దేశాల్లో మాత్రమే ఉన్నాయి. సోమాలియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నౌరు, కాంగో,ఎస్తోనియా,అల్బేనియా , జార్జియా ఇలాంటి చాలా  దేశాల్లో మనకి రాయబార కార్యాలయాలు లేవు. అలాంటప్పుడు వ్యవహరం జరపడానికి వాటికి దగ్గరలోని మన దేశ ఎంబసీలు సహకారం అందిస్తాయి. రాయబార కార్యాలయాల్ని నడపడానికి చాలా ఖర్చులు అవుతాయి. కనుక అవసరం లేని దేశాల్లో అవి ఉండవని చెప్పాలి. రాజకీయంగా, వాణిజ్యపరంగా,వ్యూహాత్మకంగా అవసరమైన దేశాల్లో మాత్రమే పూర్తి సిబ్బంది తో పని చేస్తుంటాయి.

రాయబార కార్యాలయాలు ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు చేపట్టడం ఈ రోజుల్లో మనం చదువుతూనే ఉన్నాం. అలాంటి పరిణామాల నేపథ్యం లో రాయబార కార్యాల సిబ్బందిని బహిష్కరించడం కూడా జరుగుతుంది. మిత్ర దేశాల లో రాయబార సిబ్బందికి పెద్ద ప్రమాదం ఉండదు కాని ఉద్రిక్త సంబంధాలు ఉన్న దేశాల్లో దాడులు జరగడం కద్దు.వీటికి సంబంధించి అంతర్జాతీయ చట్టాలు ఉన్నా రక్షణ లేని సందర్భాలు ఉన్నాయి. ప్రపంచం అంతా కుగ్రామం అయిపోయిన ఈ కాలం లో టూరిస్టులు అనేకమంది వివిధ దేశాలకి క్యూ కడుతుండటం తో ఇన్నాళ్ళపాటు ఏమీ పట్టనున్న కొన్ని దేశాలు కూడా ఇతర దేశాల్లో తమ రాయబార కార్యాలయాల్ని తెరుస్తున్నాయి. 


----- మూర్తి కెవివిఎస్              

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి