Pages

5, అక్టోబర్ 2025, ఆదివారం

రస్కిన్ బాండ్ రాసిన ఓ చక్కని పుస్తకం

 రస్కిన్ బాండ్ రాసిన ద బ్లూ అంబరెల్ల అనే పుస్తకాన్ని చాలా వేగంగా చదివిన పుస్తకం గా చెప్పాలి. దీనికి రెండు ప్రధాన కారణాలు. బాండ్ యొక్క రచనలు మన బాల్యాన్ని కళ్ళ ముందు చూపుతాయి. అదే సమయం లో కథ నడిపే విధానం చాలా సహజంగా ఉంటుంది. ప్రకృతి వర్ణనలు ఎంతో గమనించితే తప్పా అంత అందంగా రాయలేరు.ముఖ్యంగా హిమాలయాల పర్వతాల కి చేరువ లో ఉన్న గ్రామాలు అక్కడి జీవితం మనకి అర్ధమవుతుంది. నిజానికి ఈ పుస్తకం పేజీల పరంగా చూస్తే చిన్నది.కానీ ఇందులోని పాత్రలు చదివిన తర్వాత చాలా రోజుల వరకు గుర్తుండిపోతాయి. బిన్యా,బిజ్జూ,రాం భరోసా,రాజారాం ప్రధాన పాత్రలు. ఈ కథ గఢ్వాల్ కొండ ప్రాంతం లోని ఓ గ్రామం లో నడుస్తూంది.


ఆ గ్రామం లో ఈ రకమైన అందంగా ఉండే గొడుగు ఎవరివద్దా లేదు. దానితో ప్రతి ఒక్కరు దానికేసి చూస్తుంటారు.బిన్యా ఎంతో అపురూపంగా దాన్ని కాపాడుకుంటూంది. తన ఫ్రెండ్స్ కి మాత్రం కాసేపు పట్టుకుండానికి ఇస్తుంది. నీలు ని మేపడానికి అడివి కి వెళ్ళినపుడు కూడా ఈ గొడుగు ఉండవలిసిందే. అలాంటి సమయం లో ఈ గొడుగు గాలీ దుమ్మూ లేచినపుడు కొట్టుకు పోయి పొడవైన గుట్ట మీద పడిపోతుంది.మొత్తానికి ఎంతో కష్టపడి గొడుగు ని దక్కించుకుంటుంది.

అలాంటి గొడుగు మీద రాం భరోసా అనే దుఖాణదారుని కళ్ళు పడతాయి. ఎన్నో రకాలుగా ఆశ చూపించి ఆ గొడుగు ఇమ్మన్నా బిన్యా ఇవ్వదు. అతని దగ్గర పని చేసే రాజారాం అనే కుర్రాడు బిన్యా పొలం పని లో ఉండగా దాన్ని కొట్టేస్తాడు.

అదే సమయం లో బిన్యా వాళ్ళ అన్న బిజ్జూ వీడిని పట్టుకుని నాలుగు పీకి గొడుగు తీసుకుంటాడు. రాం భరోసా నే ఈ సంఘటన వెనక ఉన్నదని గ్రామం అంతా తెలిసిపోతుంది. దాంతో ఈ వ్యాపారి దుఖాణానికి కొనడానికి గ్రామస్తులు ఎవరూ రారు. దాంతో జాలిపడి బిన్యా,బిజ్జూలు ఏ విధంగా మళ్ళీ అతనికి సాయం చేశారు అన్నది సస్పెన్స్. 

దానితో ఆ వ్యాపారి ఎంతో సంతోషించి వీళ్ళద్దరినీ ఎలా చక్కగా చూసుకున్నాడన్నది చివరిలో మనకి తెలుస్తుంది. కథ అంతా బోరు కొట్టకుండా ఏకబిగిన చదవాలనిపిస్తుంది. హిమాలయ గ్రామాల్లోని పూల చెట్లు,ఊరిలో ఉండే మొక్కలు ఇలాంటివి అన్నీ సందర్భానుసారంగా మనకి తెలుస్తాయి.అర్చనా శ్రీనివాసన్ వేసిన బొమ్మలు ఎంతో హాయిగా ఉన్నాయి.   

బిన్యా అనే చిన్న అమ్మాయి. సుమారు పదకొండు ఏళ్ళు. ఆమెకి బిజ్జూ అనే అన్నయ్య , వాడికి ఇంకో రెండేళ్ళు ఎక్కువ. వాళ్ళు పుట్టినప్పుడు ఎలాంటి తారీకులు నమోదు చేయలేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి చదువులేదు కదా.వారి కుటుంబానికి కొద్ది భూమి ఉంటుంది.కొన్ని ఆవులు ఉంటాయి.వాటి మీదనే వారి జీవనం సాగుతుంది.ఒక ఆవు పేరు నీలు. ఆ ఆవు ని బిన్యా అడవి లో మేపుతుండగా , ఢిల్లీ నుంచి ఓ కుటుంబం ఆ అడివి లోకి వచ్చి విహార యాత్ర చేస్తుంటారు. 

దాంట్లో ఒకరి దగ్గర చక్కని నీలం రంగు లో ఉన్న గొడుగు కనబడుతుంది. అది బిన్యా కి ఎంతో నచ్చుతుంది. అలాగే ఆశ గా చూస్తూ నిలబడగా , విహార యాత్ర కి వచ్చిన వాళ్ళు ఆమెకి దాన్ని బహూకరిస్తారు. ఆ అమ్మాయికి ఎంతో ఆనందం కలిగి ,ఆమె దగ్గర ఉన్న పులిగోరు తో చేసిన వస్తువు ని ఇస్తుంది.       

 ఆ గ్రామం లో ఈ రకమైన అందంగా ఉండే గొడుగు ఎవరివద్దా లేదు. దానితో ప్రతి ఒక్కరు దానికేసి చూస్తుంటారు.బిన్యా ఎంతో అపురూపంగా దాన్ని కాపాడుకుంటూంది. తన ఫ్రెండ్స్ కి మాత్రం కాసేపు పట్టుకుండానికి ఇస్తుంది. నీలు ని మేపడానికి అడివి కి వెళ్ళినపుడు కూడా ఈ గొడుగు ఉండవలిసిందే. అలాంటి సమయం లో ఈ గొడుగు గాలీ దుమ్మూ లేచినపుడు కొట్టుకు పోయి పొడవైన గుట్ట మీద పడిపోతుంది.

మొత్తానికి ఎంతో కష్టపడి గొడుగు ని దక్కించుకుంటుంది.అలాంటి గొడుగు మీద రాం భరోసా అనే దుఖాణదారుని కళ్ళు పడతాయి. ఎన్నో రకాలుగా ఆశ చూపించి ఆ గొడుగు ఇమ్మన్నా బిన్యా ఇవ్వదు. అతని దగ్గర పని చేసే రాజారాం అనే కుర్రాడు బిన్యా పొలం పని లో ఉండగా దాన్ని కొట్టేస్తాడు.

అదే సమయం లో బిన్యా వాళ్ళ అన్న బిజ్జూ వీడిని పట్టుకుని నాలుగు పీకి గొడుగు తీసుకుంటాడు. రాం భరోసా నే ఈ సంఘటన వెనక ఉన్నదని గ్రామం అంతా తెలిసిపోతుంది. దాంతో ఈ వ్యాపారి దుఖాణానికి కొనడానికి గ్రామస్తులు ఎవరూ రారు. దాంతో జాలిపడి బిన్యా,బిజ్జూలు ఏ విధంగా మళ్ళీ అతనికి సాయం చేశారు అన్నది సస్పెన్స్. 

దానితో ఆ వ్యాపారి ఎంతో సంతోషించి వీళ్ళద్దరినీ ఎలా చక్కగా చూసుకున్నాడన్నది చివరిలో మనకి తెలుస్తుంది. కథ అంతా బోరు కొట్టకుండా ఏకబిగిన చదవాలనిపిస్తుంది. హిమాలయ గ్రామాల్లోని పూల చెట్లు,ఊరిలో ఉండే మొక్కలు ఇలాంటివి అన్నీ సందర్భానుసారంగా మనకి తెలుస్తాయి.అర్చనా శ్రీనివాసన్ వేసిన బొమ్మలు ఎంతో హాయిగా ఉన్నాయి.   

( A book I have read the fastest)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి