Pages

other news లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
other news లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, అక్టోబర్ 2025, ఆదివారం

రస్కిన్ బాండ్ రాసిన ఓ చక్కని పుస్తకం

 రస్కిన్ బాండ్ రాసిన ద బ్లూ అంబరెల్ల అనే పుస్తకాన్ని చాలా వేగంగా చదివిన పుస్తకం గా చెప్పాలి. దీనికి రెండు ప్రధాన కారణాలు. బాండ్ యొక్క రచనలు మన బాల్యాన్ని కళ్ళ ముందు చూపుతాయి. అదే సమయం లో కథ నడిపే విధానం చాలా సహజంగా ఉంటుంది. ప్రకృతి వర్ణనలు ఎంతో గమనించితే తప్పా అంత అందంగా రాయలేరు.ముఖ్యంగా హిమాలయాల పర్వతాల కి చేరువ లో ఉన్న గ్రామాలు అక్కడి జీవితం మనకి అర్ధమవుతుంది. నిజానికి ఈ పుస్తకం పేజీల పరంగా చూస్తే చిన్నది.కానీ ఇందులోని పాత్రలు చదివిన తర్వాత చాలా రోజుల వరకు గుర్తుండిపోతాయి. బిన్యా,బిజ్జూ,రాం భరోసా,రాజారాం ప్రధాన పాత్రలు. ఈ కథ గఢ్వాల్ కొండ ప్రాంతం లోని ఓ గ్రామం లో నడుస్తూంది.


ఆ గ్రామం లో ఈ రకమైన అందంగా ఉండే గొడుగు ఎవరివద్దా లేదు. దానితో ప్రతి ఒక్కరు దానికేసి చూస్తుంటారు.బిన్యా ఎంతో అపురూపంగా దాన్ని కాపాడుకుంటూంది. తన ఫ్రెండ్స్ కి మాత్రం కాసేపు పట్టుకుండానికి ఇస్తుంది. నీలు ని మేపడానికి అడివి కి వెళ్ళినపుడు కూడా ఈ గొడుగు ఉండవలిసిందే. అలాంటి సమయం లో ఈ గొడుగు గాలీ దుమ్మూ లేచినపుడు కొట్టుకు పోయి పొడవైన గుట్ట మీద పడిపోతుంది.మొత్తానికి ఎంతో కష్టపడి గొడుగు ని దక్కించుకుంటుంది.

అలాంటి గొడుగు మీద రాం భరోసా అనే దుఖాణదారుని కళ్ళు పడతాయి. ఎన్నో రకాలుగా ఆశ చూపించి ఆ గొడుగు ఇమ్మన్నా బిన్యా ఇవ్వదు. అతని దగ్గర పని చేసే రాజారాం అనే కుర్రాడు బిన్యా పొలం పని లో ఉండగా దాన్ని కొట్టేస్తాడు.

అదే సమయం లో బిన్యా వాళ్ళ అన్న బిజ్జూ వీడిని పట్టుకుని నాలుగు పీకి గొడుగు తీసుకుంటాడు. రాం భరోసా నే ఈ సంఘటన వెనక ఉన్నదని గ్రామం అంతా తెలిసిపోతుంది. దాంతో ఈ వ్యాపారి దుఖాణానికి కొనడానికి గ్రామస్తులు ఎవరూ రారు. దాంతో జాలిపడి బిన్యా,బిజ్జూలు ఏ విధంగా మళ్ళీ అతనికి సాయం చేశారు అన్నది సస్పెన్స్. 

దానితో ఆ వ్యాపారి ఎంతో సంతోషించి వీళ్ళద్దరినీ ఎలా చక్కగా చూసుకున్నాడన్నది చివరిలో మనకి తెలుస్తుంది. కథ అంతా బోరు కొట్టకుండా ఏకబిగిన చదవాలనిపిస్తుంది. హిమాలయ గ్రామాల్లోని పూల చెట్లు,ఊరిలో ఉండే మొక్కలు ఇలాంటివి అన్నీ సందర్భానుసారంగా మనకి తెలుస్తాయి.అర్చనా శ్రీనివాసన్ వేసిన బొమ్మలు ఎంతో హాయిగా ఉన్నాయి.   

బిన్యా అనే చిన్న అమ్మాయి. సుమారు పదకొండు ఏళ్ళు. ఆమెకి బిజ్జూ అనే అన్నయ్య , వాడికి ఇంకో రెండేళ్ళు ఎక్కువ. వాళ్ళు పుట్టినప్పుడు ఎలాంటి తారీకులు నమోదు చేయలేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి చదువులేదు కదా.వారి కుటుంబానికి కొద్ది భూమి ఉంటుంది.కొన్ని ఆవులు ఉంటాయి.వాటి మీదనే వారి జీవనం సాగుతుంది.ఒక ఆవు పేరు నీలు. ఆ ఆవు ని బిన్యా అడవి లో మేపుతుండగా , ఢిల్లీ నుంచి ఓ కుటుంబం ఆ అడివి లోకి వచ్చి విహార యాత్ర చేస్తుంటారు. 

దాంట్లో ఒకరి దగ్గర చక్కని నీలం రంగు లో ఉన్న గొడుగు కనబడుతుంది. అది బిన్యా కి ఎంతో నచ్చుతుంది. అలాగే ఆశ గా చూస్తూ నిలబడగా , విహార యాత్ర కి వచ్చిన వాళ్ళు ఆమెకి దాన్ని బహూకరిస్తారు. ఆ అమ్మాయికి ఎంతో ఆనందం కలిగి ,ఆమె దగ్గర ఉన్న పులిగోరు తో చేసిన వస్తువు ని ఇస్తుంది.       

 ఆ గ్రామం లో ఈ రకమైన అందంగా ఉండే గొడుగు ఎవరివద్దా లేదు. దానితో ప్రతి ఒక్కరు దానికేసి చూస్తుంటారు.బిన్యా ఎంతో అపురూపంగా దాన్ని కాపాడుకుంటూంది. తన ఫ్రెండ్స్ కి మాత్రం కాసేపు పట్టుకుండానికి ఇస్తుంది. నీలు ని మేపడానికి అడివి కి వెళ్ళినపుడు కూడా ఈ గొడుగు ఉండవలిసిందే. అలాంటి సమయం లో ఈ గొడుగు గాలీ దుమ్మూ లేచినపుడు కొట్టుకు పోయి పొడవైన గుట్ట మీద పడిపోతుంది.

మొత్తానికి ఎంతో కష్టపడి గొడుగు ని దక్కించుకుంటుంది.అలాంటి గొడుగు మీద రాం భరోసా అనే దుఖాణదారుని కళ్ళు పడతాయి. ఎన్నో రకాలుగా ఆశ చూపించి ఆ గొడుగు ఇమ్మన్నా బిన్యా ఇవ్వదు. అతని దగ్గర పని చేసే రాజారాం అనే కుర్రాడు బిన్యా పొలం పని లో ఉండగా దాన్ని కొట్టేస్తాడు.

అదే సమయం లో బిన్యా వాళ్ళ అన్న బిజ్జూ వీడిని పట్టుకుని నాలుగు పీకి గొడుగు తీసుకుంటాడు. రాం భరోసా నే ఈ సంఘటన వెనక ఉన్నదని గ్రామం అంతా తెలిసిపోతుంది. దాంతో ఈ వ్యాపారి దుఖాణానికి కొనడానికి గ్రామస్తులు ఎవరూ రారు. దాంతో జాలిపడి బిన్యా,బిజ్జూలు ఏ విధంగా మళ్ళీ అతనికి సాయం చేశారు అన్నది సస్పెన్స్. 

దానితో ఆ వ్యాపారి ఎంతో సంతోషించి వీళ్ళద్దరినీ ఎలా చక్కగా చూసుకున్నాడన్నది చివరిలో మనకి తెలుస్తుంది. కథ అంతా బోరు కొట్టకుండా ఏకబిగిన చదవాలనిపిస్తుంది. హిమాలయ గ్రామాల్లోని పూల చెట్లు,ఊరిలో ఉండే మొక్కలు ఇలాంటివి అన్నీ సందర్భానుసారంగా మనకి తెలుస్తాయి.అర్చనా శ్రీనివాసన్ వేసిన బొమ్మలు ఎంతో హాయిగా ఉన్నాయి.   

( A book I have read the fastest)

22, సెప్టెంబర్ 2025, సోమవారం

మళయాళ చిత్రసీమ లో కేవలం ఇద్దరే ఆ అవార్డ్ పొందారంటే చిత్రమే!


 ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఈ నెల 20 తేదీన 2023 ఏడాదికి గాను ఆయనకి ఈ అవార్డ్ ని ప్రదానం చేయనున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. విచిత్రం ఏమిటంటే ఇప్పటిదాకా మళయాళ చిత్రసీమ లో కేవలం ఇద్దరు మాత్రమే ఈ సినిమా రంగానికి చెందిన అత్యున్నత అవార్డ్ ని పొందారు. మొదటి వ్యక్తి ప్రఖ్యాత మళయాళ దర్శకుడు ఆడూర్ గోపాల కృష్ణన్ కాగా రెండవ వ్యక్తి ప్రస్తుతం మోహన్ లాల్. అనేకమంది ఉద్ధండులైన దర్శకులు, నటులు ఉన్న ఆ చిత్రసీమ లో కేవలం ఇద్దరు మాత్రమే పొందడం చాలామందిని ఆశ్చర్యపరిచే అంశం.

ఈ రోజు ఫాల్కే పురస్కారం అందుకోబోతున్న మోహన్ లాల్ తన 60 ఏళ్ళ జీవితం లో 350 కి పైగా సినిమాల్లో, అదీ వివిధ భాషలకి చెందిన సినిమాల్లో నటించారు. తమిళ, మళయాళ ఇంకా ఇతర సినీ అభిమానులు ఓ వైపు పొగడ్తలతో ముంచెత్తుతుండగా, మరో వైపు ఆయన్ని విమర్శ చేస్తున్నవారూ ఉన్నారు. 74 ఏళ్ళ మమ్మూట్టి కి దాదా సాహెబ్ ఫాల్కే ఎప్పుడో ఇవ్వవలసి వుందని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో బాధ వ్యక్తం చేస్తున్నారు. అయితే మమ్మూట్టి మటుకు మోహన్ లాల్ కి ఫాల్కె రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మెసేజ్ చేశారు. తమిళ ప్రేక్షకులు కమల్ హాసన్ కి ఈ అవార్డ్ ఇంకా ఇవ్వకపోడం దారుణం అని పోస్టులు పెడుతున్నారు.  

మోహన్ లాల్ విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయి లో ఉత్తమ నటుడిగా నాలుగుసార్లు అవార్డులు అందుకున్నారు. పద్మశ్రీ,పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. ఇండియన్ ఆర్మీ ఆయనకి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ని 2009 లో ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని పొందిన ఏకైక దక్షిణాది నటుడు మోహన్ లాల్. కాలడి యూనివర్శిటి గౌరవ డాక్టరేట్ ని 2010 లో ప్రదానం చేసింది. సంస్కృత భాష లో నాటకాలు వేసి ఆయన ఆ భాషకి చేసిన సేవ కి గాను ఆ గౌరవం దక్కింది. కొంతకాలం సంస్కృత భాష లో వార్తలు కూడా చదివారు.

మోహన్ లాల్ నటించిన 350 కి పైగా సినిమాల్లో తప్పనిసరిగా చూడవలసిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. మళయాళం లో వచ్చిన తన్మాత్ర, వానప్రస్థం, భ్రమరం, కిరీడం, బాలెట్టాన్, కిరీడం, భరతం వంటి సినిమాలు ఆయన నటనా జీవితం లో ఆణిముత్యాలు లాంటివి. దృశ్యం పేరు తో వచ్చిన రెండు సినిమాలు అబాలగోపాలాన్ని అలరించడమే గాక,తెలుగు ఇంకా హిందీ లో కూడా రీమేక్ అయ్యాయి.ప్రస్తుతం దృశ్యం కి మూడవ ఎపిసోడ్ తయారవుతోంది. అదీ కూడా హిట్ అయి అందర్నీ అందర్నీ అలరించాలని కోరుకుందాం.