నేపాల్ మనకి మిత్ర దేశమనే సంగతి తెలిసినదే. కానీ పాలకుల మూర్ఖత్వం వల్ల అప్పుడప్పుడు మన శత్రు దేశాల ప్రయోజనాలకి మొగ్గు చూపుతుంది.ఉదాహరణకి ప్రస్తుతం చూస్తే,బాలేంద్ర షా గద్దె నెక్కిన తర్వాత ప్రదర్శిస్తున్న తల బిరుసుతనం ఏ వైపు కి దారి తీస్తుందో తెలియవలసి ఉంది.మానస సరోవరం దర్శించాలనుకునే భారతీయులకి మోకాలు అడ్డేలా నేపాల్ ప్రధాని ప్రవర్తిస్తున్నాడు. లిపుకేష్,లింపియాధుర,కాలా పాని నేపాల్ లో భాగాలని దారి ఇవ్వడం కుదరదని బాలెన్ మాట్లాడాడు.ఈ విషయం మీద మాట్లాడాలని విదేశాంగ శాఖ సెక్రెటరి ప్రయత్నించగా ఆయనకి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు.తనతో మాట్లాడాలంటే భారత ప్రధాని మాత్రమే మాట్లాడాలని కండీషన్ పెట్టాడు.దీన్ని అక్కడి ప్రతిపక్షాలు సైతం తప్పు పట్టాయి.
అసలు పార్లమెంట్ కి ఎనికైన దగ్గరనుంచి పోకుండా బాలెన్ మొండికేస్తున్నాడు. అవసరమయితే మంత్రులు సమాధానం చెబుతారు.నేను రానని అంటూండగా,ప్రతిపక్షాలు బాలెన్ పదవి నుండి తక్షణం దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాయి.ఇంతవరకు ఎన్నికయిన ఏ ప్రధాని ఇలా బిహేవ్ చేయలేదంటున్నారు. రాపర్ గా ఉన్నాడిని ఎకాఎకి ఆ స్థానం లో కూర్చోబెట్టడం తమ తప్పని రూలింగ్ పార్టీ నాయకులు అంటున్నారు. ఎంత బెట్టు చేసినా నేపాల్ దిగిరాకా తప్పదు.4 మిలియన్ల నేపాలీలు మన దేశం లో పనిచేస్తున్నారు.మన 100 రూపాయలు అక్కడ 160 రూపాయలు. నేపాల్ వారు మన దేశం లో UPSC పరీక్ష రాసి ఇక్కడ IAS,IPS లాంటి ఉన్నతోద్యోగాలు కూడా చేయవచ్చు.
1950 లో జరిగిన ఇండియా నేపాల్ ఒప్పందం వల్ల మన దేశం వారికి ఎన్నో రాయితీలు ఇచ్చింది.వీసా,పాస్ పోర్ట్ లేకుండా రాకపోకలు జరపవచ్చు.సాంస్కృతికంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంభంధాల్ని తెగగొట్టుకునేలా ప్రవర్తిస్తే నేపాల్ కే ఎక్కువ నష్టం. ఎవరెస్ట్ శిఖరం మీద చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల మీద చైనా,నేపాల్ నిపుణుల బృందం పరిశోధన చేయడానికి నిన్నటి రోజున శాంపిల్స్ సేకరించారని వార్తలు వచ్చాయి. మరి ఆ రెండు దేశాల సహకారం ఎక్కడినుంచి ఎక్కడికి వెళుతుందో కాలమే చెప్పాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి