Pages

14, జులై 2026, మంగళవారం

ఎంతసేపు పుచ్చు పాలిటిక్స్ తప్పా కళ ని గౌరవించడం అనేది జాంతా నై

 


సుప్రసిద్ధ గాయని ఎస్.జానకి గారు జూలై 11 వ తేదీనాడు మైసూరు లోని ఓ ప్రైవేట్ వైద్యశాల లో మరణించారు. ఆమె చివరి శ్వాస మైసూరు లోనే వదలాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.అక్కడ కూడా లో ప్రొఫైల్ లోనే జీవించినట్లు తెలుస్తోంది. బాలు మరణాంతరం ఆయనకి తెలుగు రాష్ట్రాలు ఇచ్చిన గొప్ప గౌరవం తెలుసు గనక ఆ కన్నడనాడు లోనే చివరి దినాలు ఆమె గడిపారు. నిస్సందేహంగా కళాకారుల్ని గౌరవించడం లో మన తెలుగు వాళ్ళ కంటే మిగతా దక్షిణాది రాష్ట్రాలు మిన్న అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు.పోయిన తర్వాత లేనిపోని రాద్ధాంతాలు చేసి, అప్పుడు కూడా పుచ్చు పొలిటిక్స్ చేసి సంతోషించే జీవులు తెలుగులు తప్పా మరెవరూ ఉండరు.  

నోటి తో కబుర్లు చెప్పడం తప్పా చేతల్లో గౌరవం ఇవ్వడం ఉండదు.మన దగ్గర గల్లీల దగ్గర్నుంచి,ఎయిర్పోర్ట్ ల వరకు అన్నీ రాజకీయ పక్షుల పేర్లే తప్పా మిగతా ఎవరి గొప్పదనాన్ని అంగీకరించం.అదే తెలుగు ప్రజల ప్రత్యేకత.బాలు పోయినప్పుడు తమిళులు గాని,జానకి గారు పోయినప్పుడు కన్నడిగుల ఆవేదన గాని కళ కి వారు ఇచ్చే గౌరవానికి మచ్చుతునక.దక్షిణాది లోని ఆ మూడు రాష్ట్రాల్లో బాలు కి ఇంకా విగ్రహాలు పెడుతూనే ఉన్నారు.అనేక నిర్మాణాలకి కూడా ఆయన పేర్లు పెడుతున్నారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి