Pages

5, మే 2014, సోమవారం

కాపుల ఓట్ల కోసం చంద్రబాబు వేసిన వ్యూహం ఫలిస్తుందా...?



ఏమో ..వేచి చూడవలసిందే..!కోస్తాలో తూర్పు కాపు,బలిజ,పెద్ద కాపు, ఇలా రకరకాలుగా అనేక రూపాల్లో పిలువబడే కాపు సామాజిక వర్గం ఓట్లు పెద్ద సంఖ్యలో నే ఉంటాయి. వీరి ఓట్లని ఆకర్షించే క్రమం లోనే చంద్రబాబు నానాపాట్లు పడి పవన్  కల్యాణ్ ని ప్రసన్నం చేసుకొని తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటున్నాడు అన్నది బహిరంగా రహస్యం.నిజానికి రంగా హత్య తరవాత కమ్మ వారి పట్ల కాపు కులస్థులకి విపరీతమైన ద్వేషం ప్రబలింది.ఇది అనేక రూపాల్లో అనేక రంగాల్లో తరచూ వ్యక్తమవుతూనే ఉంటుంది.అలాంటి వీరు తెలుగు దేశానికి  ఎలా ఓటు వేస్తారు...?

దానికి విరుగుడుగా మరి ఎలా ఏం చేసి ఒప్పించాడో గాని బాబు పవన్ ని ప్రచారానికి ఒప్పించాడు.ఇది బాబు సాధించిన విజయమనే చెప్పాలి. మరి ఏ రేంజ్ లో ఇది సక్సస్ అయి ఓట్లు రాల్చుతుందో వేచి చూడాలి.కాపులకి డిప్యూటి సి.ఎం.ఇస్తానని కూడా అండం ఇందుకనే.ఒక్కసారి అధికారం లభిస్తే బాబు ఒక్కొక్కడితో ఎలా ఆడుకుంటాడో జనాలకి బాగా తెలుసు.మరి చూద్దాం...ఈ ఎత్తుగడలు ఏ ఫలితాలు ఇస్తాయో..??? 

1 కామెంట్‌:

  1. ఆంధ్ర ద్రోహులందరికి బుద్ది చెప్పడానికి ఇదే మంచి అవకాశం. ఆంధ్రులకి అన్యాయం చేసిన దొంగలకు, విదెశి తాబేదార్లకు ఓటుతొ చెంప చెళ్ళుమనిపించండి. ఆంధ్ర పౌరుషం వేద కాలం నుంచి వున్న ఆంధ్రులకి సాటి లేదని చాటండి.ఇక ఈ జగన్నాథ రథానికి గాడిదల పీడ వదిలింది, గుర్రాలమైన మనం ఉన్నాం చాలు అని ఎలుగెత్తి గర్జించండి.

    రిప్లయితొలగించండి