Pages

23, మార్చి 2017, గురువారం

వీళ్ళ దోపిడికి అంతు అనేది లేదా..?


బ్యాంక్ లు ఇటీవల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కస్టమర్ల ని నిలువు దోపిడి చేస్తున్నట్లుగా అర్ధమవుతుంది.కనీస మొత్తం లేకపోతే బాదుడు,రెండు లక్షలు పైన వ్యవహారం చేస్తే బాదుడు,ATM ల లో మూడు సార్లు వారానికి మించి తీస్తే బాదుడు,ఇలా ప్రతి దానికి బాదుతూ జనాల్ని చికాకు చేస్తూన్నాయి.చాలా ప్రముఖ బ్యాంక్ ల ATM లు పేరు కే తప్ప ఎప్పుడు డబ్బు డ్రా చేద్దామని వెళ్ళినా పని చేయవు.అప్పుడు కస్టమర్ ఎన్యో నిరాశ కి లోనవుతాడు.చాలా అర్జంట్ పనులు కూడా ఆగిపోతుంటాఇ.మరి అలాంటప్పుడు మనం అంతా కలిసి ఒక డిమాండ్ ఎందుకు చేయకూడదు.మూడు సార్లు ATM లు ఈ విధన్ గా ఫేలయితే దానికి తగిన నగదు మూల్యం వడ్డీ రూపం లో కస్టమర్ కి ఇవ్వాలి లేదా మరో రకంగా పూరించాలి.

కోటీశ్వరుల  రుణాలను ఎంతో ఉదారంగా వదిలేస్తూ ..దానికి రకరకాల ముద్దు పేర్లు పెట్టి ..ఆ భారాన్ని సామాన్య జనాల మీద తొయ్యడం ఎంత మాత్రం భావ్యం కాదు.ప్రజలంతా అన్ని రకాల భేషజాల్ని వదిలి బ్యాంక్ ల దోపిడి మీద పోరాడవలసిన అవసరం ఈరోజు ఏర్పడింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి