Pages

4, జనవరి 2015, ఆదివారం

నైనా సెహ్వాల్ మరీ తొందరపడుతున్నదేమో..?



తన పేరు ని పద్మ భూషణ్ కి సిఫార్స్ చేయడం లో BOI అలసత్వం చేసిందని నైనా ఆరోపించడం ఆమె ఇమేజ్ ని ఇంకా పలచన చేసింది.ఆమె బాడ్మింటన్ క్రీడాకారిణి గా పరిగణించదగ్గ విజయాలే సాధించి ఉండవచ్చుగాక..గాని పబ్లిక్ లోకి ఆ విషయాన్ని తెచ్చి రచ్చ జేయడం తగని పని.ఎంతోమంది అర్హతగలవాళ్ళు జీవితం చివరి అంకం లో పడ్మశ్రీ అందుకుకున్నారు. అంటే వారికి అర్హత లేక కాదు..దాంట్లో ఉండే రాజకీయాలవల్ల.బాపు లాంటి గొప్ప చిత్రకారునికి ఆయన చివరి దశ లో పద్మశ్రీ ఇస్తే తెలుగు వాళ్ళు అంతా ఆశ్చర్యపోయారు.ఆ అవార్డులు ఎంత భ్రష్టు  పట్టాయో చంటి పిల్లాడికి కూడా తెలిసిపోయింది. గతం లో సానియా కి కెసియార్ నజరాన ప్రకటించినప్పుడు కూడా ఈ నైనా బాహాటంగా తన అసంతృప్తి వెల్లడించింది.అయినా పద్మశ్రీ వచ్చిన అయిదేళ్ళు అయిందో లేదో వెంటనే పద్మభూషణ్ కి అంత తొందర ఏమిటో..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి