Pages

23, జులై 2016, శనివారం

విదేశీ పెట్టుబడులు మీద శ్వేతపత్రం ప్రతి ఏటా ఎందుకు ప్రకటించరు..?

విదేశీ పెట్టుబడులు మీద శ్వేతపత్రం ప్రతి ఏటా ఎందుకు ప్రకటించరు..? మాట్లాడితే రాష్ట్రం బాగుపడాలంటే వేరే దేశాల కంపెనీలు పెట్టుబళ్ళు పెడితే తప్ప జరగదనే భావనకి ప్రజల్ని పాలకులు తీసుకొచ్చారు.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు గురించి చెప్పాల్సిన పని లేదు.రకరకాల విదేశీ వ్యక్తులతో ఫోటోలు మాత్రం పేపర్ల లో దండి గా వస్తున్నాయి.ఎన్ని కంపెనీలు ఇప్పటి దాకా వచ్చాయి,ఎంతమందికి దానివల్ల ఉద్యోగాలు దొరికాయి,రాష్ట్ర ప్రగతి లో వాటి వాటా ఎంత,వాటి కార్యకలాపాలు ఏమిటి..ఇవన్నీ ఎందుకు ప్రతి ఏటా ఎందుకు బహిరంగపరచరు..?ఇవి తెలుసుకునే హక్కు ప్రజలకి లేదా..?

ఇక రాజధాని ని ఫారిన్ కంపెనీలు తప్ప భారతీయులు కట్టలేరు అని చెప్పుకోవడం సిగ్గు చేటు కాదా..? ఇన్నాళ్ళ స్వాతంత్ర్యానికి ,మన ప్రభుత్వాలు ఇచ్చిన విద్య ఇదంతా కేవలం డొల్ల అని ఒప్పుకుంటున్నట్లేగా..?పాలన మాత్రం ఎందుకు...అది కూడా విదేశీయులకే కట్టబెడితే ఇంకా బాగా ఉంటుందిగా..అబ్బే అది మాత్రం మనకే కావాలి,అడ్డంగా దోచుకోవడానికి..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి