Pages

15, మే 2023, సోమవారం

పొన్నియన్ సెల్వన్-2 సినిమా పై నా అభిప్రాయం

 మొత్తానికి నిన్ననే చూశాను "పొన్నియన్ సెల్వన్-2" మొదటి పార్ట్ తో పోల్చితే మరీ అంత బోరు గా అనిపించలేదు. కట్టు కథల్ని అయితే అటుది ఇటు మార్చి గూస్ బంప్స్ వచ్చేలా ఏదో తీయచ్చు.కాని చరిత్ర కథ. ఇష్టం వచ్చినట్టు తీయడం కుదరదు.కొన్ని లిమిట్స్ ఉంటాయి ఊహలకి కూడా. అలా సర్దుకు పోవాలి. అందునా తమిళ సగటు పాఠకుడి కి కూడా ఎంతో కొంత చోళుల చరిత్ర తెలుసు.

కొన్ని తమిళ యూట్యూబుల్లో ఈ సినిమా మీద ఆధారపడి ఇంటర్వ్యూలు గట్రా బాగా వచ్చాయి.ఒక్కొకళ్ళది ఒక్కో వెర్షన్. భారతీ రాజా లాంటి దర్శకుడు కూడా ఓచోట, అయ్యా మణిరత్నం గారు మీకు సంస్కృతం అంటే ఎందుకు అంత మోజు..? చోళులు దైవ స్త్రోత్రాల్ని కూడా అచ్చ ప్రాచీన తమిళం లోనే రాశారు,రాయించారు గదా అంటూ ఓ చురక వేశాడు. అట్లా తమిళ సమాజం లో చాలా చర్చ సినిమా బయట కూడా జరిగింది. డబ్బింగ్ చేయడం లో ఒరిజినాలిటి కొంత పోవడం సహజమే గదా.

సాహిత్యం,సంగీతం,శిల్ప శాస్త్రం,సముద్రం పై పయనించి దండయాత్రలు చేయడం,ఇలా ఎన్నో విషయాల్లో తమిళుల పై ప్రభావం చూపారు.ఇంకా చూపుతూనే ఉన్నారు.భావ పరం గా. ఆ మనసుల్లో ఉన్న బరువు మనకి తెలియదు. కాబట్టి మనకి చోళులు అంటే అనేకమంది రాజుల్లో వాళ్ళూ ఒకరు.అంతే కాదు,చోళులు,పాండ్యులు వీళ్ళని ఓన్ చేసుకునే కులాలు కొన్ని తమిళనాడు లో ఉన్నాయి.వాళ్ళ గొడవ వాళ్ళది.రకరకాల ఆధారాలు చూపిస్తూ మా వాళ్ళని చూపించవలసింత గా చూపించలేదని.

 శ్రీ లంక లో చనిపోయాడనుకున్న అరుళ్ మొళి వర్మ రక్షింపబడటం దగ్గరనుంచి ఈ సినిమా లో కథ మొదలు అవుతుంది. సుందర చోళుడు కూడా రక్షింపబడతాడు.వీళ్ళిద్దర్నీ సేవ్ చేసినవారు నందిని యొక్క తల్లి.

ఓ సీక్రెట్ రివీల్ అయింది.కరికాళుడు చనిపోవడాన్ని స్పష్టం గాచూపించలేదు.చరిత్ర పరంగా కూడా ఆయన మరణం ఎలా జరిగింది అనేది ఎవరికీ తెలియదు.రాష్ట్రకూటుల కుట్ర యత్నాలు అదనం గా దీనిలో చూడవచ్చు.అప్పుడూ,ఇప్పుడూ అధికారం దగ్గరకి వచ్చేసరికి దగ్గర వాళ్ళతోనే అసలైన గొడవలూ,కుతంత్రాలు.అవి బాగా చూపించారు.మణిరత్నం చాలా సీన్లని చాలా Subtle గా ప్లే చేశాడు దాన్ని తమిళ ఆడియన్స్ బాగా ఆస్వాదన చేస్తారు. చివరకి మధురాంతకుడికి కిరీటం ఇవ్వడం,ఆ తర్వాత 13 ఏళ్ళకి అరుళ్ మొళి వర్మ (రాజరాజ చోళుడు) రాజ్యానికి రావడం జరిగిందని చెప్పి సినిమా ముగిస్తారు.

 చారిత్రక నవలని సుందరమైన దృశ్య కావ్యం గా తీసిన మణిరత్నం అభినందనీయుడు. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం బావుంది.సినిమాటోగ్రఫీ గొప్ప అస్సెట్. నటీ నటులు అందరూ జీవించారు.వాళ్ళు మిగతా ఎన్ని సినిమాల్లో నటించినా ఆ పాత్రలు మాత్రం నిలిచిపోతాయి.ముందే చెప్పా,ఇది తమిళుల నేల మరియు ఉద్వేగానికి సంబందించిన సినిమా.ఆ పరం గా గొప్ప విజయం. మిగతా అన్ని భాషల వారికి ఇది చేరగలగడం మాత్రం బోనస్.అంతే.   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి