Pages

16, జులై 2014, బుధవారం

పోలవరం రభస కి నా పరిష్కారం..!



పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి జరుగుతున్న ఆందోళనలు..నిరుపేద గిరిజనుల ఆక్రందనలు ఇవి అన్ని చూసిన తరువాత నాకొక ఆలోచన వచ్చింది.ఏ పక్షం వారికి అన్యాయం జరగదు దీనివల్ల.అదేంటంటే ఎలాగు పార్లమెంటు లో బిల్లు పాసయ్యి పోయింది ..కాబట్టి ఢోకా లేదు.హైదరా బాదు  పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది గదా.తాత్కాలిక ప్రాతిపదిక మీద పోలవరం ముంపు గ్రామాలని కూడా పది ఏళ్ళ పాటు తెలగాణా లోనే ఉండనిస్తే సరి.ఆ విధంగా ఇరు ప్రభుత్వాలు అగ్రిమెంట్ రాసుకోవాలి.ఎప్పుడైతే మళ్ళీ పోలవరం అప్పగిస్తారో అదేరోజున హైదరాబాదు నుంచి పూర్తి స్థాయిలో సీమాంధ్రులు తమ రాజధానికి వెళతారు.అంతదాకా యధాతధంగా కొనసాగవచ్చు.ఇప్పుడున్న గ్రామాలన్ని అంత అర్జంటుగా ఏమి పోలావరం లో మునగవు.కొన్ని ఏళ్ళు పడుతుంది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి