Pages

21, ఫిబ్రవరి 2015, శనివారం

రామానాయుడి అంత్యక్రియలకి రాష్ట్ర ప్రభుత్వ పరంగా సహకరించడం కెసీఅర్ విజ్ఞతకి సంకేతం


ప్రముఖ చిత్ర నిర్మాత డి.రామానాయుడి అంత్యక్రియల్ని అధికారికంగా తెలంగాణా ప్రభుత్వం నిర్వహించడం విజ్ఞతకి నిదర్శనం.అందుకు కెసీఅర్ ని అభినందించవలసిందే.కాని కొంతమంది కరుడు గట్టిన తెలంగాణావాదులు విమర్శించడం అర్ధం లేని విషయం.ఎలానూ తెలంగాణా వచ్చింది.ఇంకా ఆంధ్రులమీద వ్యతిరేఖ వైఖరి పెంచిపోషించడం తెలివిమాలిన పని.ఎవరి దారి లో వారు అభివృద్ది లో పయనిస్తూ సాధ్యమైన చోట సహకరించుకుంటూ ముందుకు సాగడమే ఇకమీదట చేయవలసిన పని.ఉద్యమం లో వేడి పుట్టడానికి,ఆరకుండా ఉండటానికి కొన్ని ఎత్తుగడలు ఎక్కడైనా ఉండేవే దాన్నే పట్టుకొని ఇంకా ద్వ్వేష భావాల్ని పెంచుకోవడం తెలివితక్కువ వైఖరి.అది అందరూ గుర్తెరగాలి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి