Pages

2, ఏప్రిల్ 2015, గురువారం

మొత్తానికి ఒక మంచి పని జరిగింది అలా..!



మాజీ ప్రధాని పి.వి.నరసిమ్హా రావు కి ఢిల్లీ లో సమాధి నిర్మాణం చేయడం అనేది ..అదీ ఇప్పుడు ఇన్నేళ్ళకి నరేంద్ర మోడి హయాం లో చేయడం అనేది సంతోషించవలసిన విషయం.అసలు ఈ పని ఎప్పుడో ఆనాడే కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడే చేస్తే బాగుండేది.కాని పోయిన వాళ్ళపట్ల కూడా తమ అక్కసుని చూపి వారి గౌరవం దిగజార్చుకున్నారు. కనీసం పట్టుమని ఏడాది కూడా పాలించలేకపోయిన గుజ్రాల్,చంద్రశేఖర్ లాంటి వాళ్ళకి పోయిన తర్వాత సమాధి కట్టడాకి స్థలం దొరికింది కాని అయిదేళ్ళు ఎన్నో వ్యతిరేకతల్ని ఎదుర్కొని కష్ట సమయం లో పార్టీ కి అండగా నిలిచిన పి.వి.కి సమాధి నిర్మాణం చేయడం సోనియా అండ్ కో వారికి ఇష్టం లేకుండా పోయింది.

ఆయన ఇరుక్కున్న కేసుల్లోంచి బయట పడేయటానికి కాలి యాత్ర కూడా చేయలేకపోయారు సింగ్ గారికి సంబందించి చేసినట్లుగా..!సరే మొత్తానికి ఇన్నాళ్ళకి ఏదో కాలం కలిసి వచ్చింది.బహుభాషా కోవిదుడు,ఒక తెలుగు వాడు ..తనకి దక్కిన గౌరవానికి సంతోషం.ఒక్కొసారి అలా జరిగిపోతుంటాయి అంతే.తగు సమయం వచ్చినప్పుడు.ఏది ఎలా జరగాలో అలా జరిగి పోతుంది అదే కాల మహిమ..పి.వి మాటల్లోనే చెప్పాలంటే కాలం తన పని తాను చేసుకుపోతుంది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి