Pages

6, సెప్టెంబర్ 2015, ఆదివారం

దేశాన్ని దోచుకు తినే వారి ఫోటోల ముందు ఈయన త్యాగం ఆనలేదా..?



భారత దేశం లో ఉన్న ఒక జబ్బు ఏమిటంటే ఎవడైతే దేశాన్ని అడ్డంగా దోచుకుంటాడో ,నానా రకాల కల్ల బొల్లి కబుర్లు చెబ్తారో ,ప్రజల్ని ప్రభుత్వాన్ని అడ్డంగా ఫ్రాడ్ చేస్తారో వాళ్ళ కి చచ్చినా ..ఆ సమయం లో కూడా వాళ్ళ బొమ్మలు పత్రికల్లో వేసి, రాసి జనాల మీదికి వదులుతుంటారు.చాలా మంది జనాలు కూడా అంతే..అంతకు తగ్గ బొంతలే.పది రూపాయలు లంచం తీసుకునే క్లర్క్ ని బుక్ చేసి ఎసిబి వాళ్ళకి పట్టించి అవినీతి ని అంతం చేసినట్లు పోజులు కొడుతుంటారు.వందల కోట్లు దోచుకునే వారి మీదికి వెళ్ళాలన్నా మాట్లాడాలన్నా భయం.ఎందుకు వాడి వెనక రాజకీయం ఆ పార్టీ ఈ పార్టీ ఉంటుందని.దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు.

అన్నట్లు ఒక విషయం...నిన్న లాన్స్ నాయక్ మోహన్ నాధ్ గోస్వామి అనే కమాండో చనిపోయాడు.నిజ జీవితం లో 10 మంది టెర్రరిస్ట్ లి మట్టుబెట్టి 1 ణ్ణి సజీవంగా పట్టుకున్న ఆయన ఒక ఎంకౌంటర్ లో మృతి చెందితే కనీసం ఆ త్యాగి ఫోటోని కూడా మన ఘనత వహించిన పత్రికలు వార్త తో పాటు వేయలేకపోయాయి.మళ్ళీ దేశ భక్తి గురించి ఎక్కడ లేని అవాకులు పేలుతుంటాయి.  ప్రతి చిన్న దానికి అమెరికా ని గుడ్డిగా అనుకరించే మన వేలం వెర్రి జనాలు దేశం కోసం త్యాగం చేసే వారిని వారి కుటుంబాల్ని ఎంతలా అలాంటి దేశాల్లో  గౌరవిస్తారో  వీరికి తెలియదా..?దానికి కారణం ఒకటే..రక్తం ఖరీదు మనకి తెలియదు.ఇది  ఒక బానిస జాతి.ఎవడి కాళ్ళు నాకి అయినా కొన్నాళ్ళు బతికి పబ్బం గడుపుకోవాలి.అది మన దేశం లోని మెజారిటీ ప్రజల ఫిలాసఫీ.ఇల్లాంటి వారు 200 కోట్లు ఉన్నా ఒకటే...వెయ్యి కోట్లు మంది ఉన్నా ఒకటే.ఒకరకంగా బెనజీర్ భుట్టో తండ్రి అప్పట్లో అన్నది నిజమే...మేము ఇండియా జన సంఖ్య ని చూసి భయపడం..ప్రతి వంద మంది హిందువులకి నలుగురు ముస్లింలు చాలు అని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి