Pages

24, మే 2014, శనివారం

హిందూ దేవాలయాల్లో ఎందుకు పరిశుభ్రతకి ప్రాధాన్యతనివ్వరు...?



ఏ హిందూ పుణ్య క్షేత్రానికి వెళ్ళినా ఎందుకో శుభ్రతకి విలువ నివ్వరు..అది ఏమిటో అర్ధం కాదు...అక్కడికి చేరువలో ఉన్న నదిలో స్నానం చేద్దామని వెళతామా...దారుణంగా అక్కడ మల విసర్జన చేస్తారు.మిగతావి సరే...సరి! ఏ ఇతర మతం వారినైనా తీసుకొండి....వారి పూజాలయాల్లో ఒక నిశ్శబ్దత..పవిత్రత ని పాటిస్తారు. కాని మన గుళ్ళలో..ఎవడి ధ్యాస వాడిదే..ఎవడి వాగుడు వాడిదే...బూతులు కూడ యదాశక్తి మాటల్లో దొర్లుతుంటాయి.అది ఒక పవిత్ర ప్రదేశం ..దాన్ని గౌరవించి అలా ఉండాలి అనే ధ్యాస ఎవరికీ ఉండదు.మన పీఠాధి పతుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.ఎంతసేపు నిధుల ని సేకరించడం.....పాదాభివందనాలు వీటిమీద ఉన్న ధ్యాస దేనిమీద ఉండదు.మరి ఇక దిశానిర్దేశం చేసేది ఎవరు...అందుకే హిందూ సమాజం చచ్చిన పాములా  ఇలా తగలడింది.

2 కామెంట్‌లు:

  1. మంచి ప్రశ్న లేవనెత్తారు.
    ఇటీవలి కాలంలో మన ప్రవర్తనలో crudity ఎక్కువవుతోంది, uncouthness ఎక్కువవుతోంది. అందుకని మీరు చెప్పినలాంటివి జరుగుతుంటాయి.

    ఇక మీరు చెప్పిన
    "కాని మన గుళ్ళలో..ఎవడి ధ్యాస వాడిదే..ఎవడి వాగుడు వాడిదే...బూతులు ఇక్ కూడ యదాశక్తి మాటల్లో దొర్లుతుంటాయి.అది ఒక పవిత్ర ప్రదేశం ..దాన్ని గౌరవించి అలా ఉండాలి అనే ధ్యాస ఎవరికీ ఉండదు."
    దానికి కారణం నా అభిప్రాయంలో భక్తి / గుడికి వెళ్ళటం అనేది ఈనాటి సమాజంలో చాలామటుకు ఒక fashion statement లాగా తయారయింది. దాని పరిణామమే దేవాలయాల్లో మనకి ఈనాడు కనబడుతున్న ఇలాంటి ప్రవర్తన.

    రిప్లయితొలగించండి
  2. నేడు ఎక్కువ మంది హిందువులు గుళ్ళకి వెలుతున్నది వారి కోరికల చిట్టా విప్పటానికి మాత్రమే, చాలా మంది హిందువులలో తమ ధర్మ రక్షణ బాధ్యతకాని తమ పవిత్రస్థలాల మీద గౌరవం కాని లేదు. తమ ధర్మం కన్నా కులానికే చాలా ప్రాముఖ్యత..... అందు కే మన దక్షిణ భారతదేశంలో యుద్ధప్రాతిపాదికిన మతమార్పడిలు జరుగుతున్నవి......

    రిప్లయితొలగించండి