Pages

12, జులై 2023, బుధవారం

మహిళలు ఇలా ఉన్నారు మన దేశంలో...


 మహిళా సాధికారత అనే మాట తరచు గా వింటూ ఉంటాము. పేపర్ల లో,టీవి ల్లో,నాయకుల ప్రసంగాల్లో ఎక్కడ చూసినా అదే. కాని గణాంకాలు మాత్రం అంత ఆశాజనకంగా లేవు.యుపిఎస్సి లోనూ,ఇతర పరీక్షల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తున్నా నిర్ణాధికారం ఉండే పోస్టుల్లోకి రావడం లేదు.మొత్తం జనాభా లో దేశం లో 48 శాతం స్త్రీ ల జనాభా ఉంది. కేవలం 25 శాతం మాత్రమే పనిచేసే వర్గం లో ఉన్నరు.

ఇది అంతా CMIE వారి లెక్కల ప్రకారం చెబుతున్నదే. మొత్తం పనిచేయగల వారి స్త్రీల జనాభా లో 94 శాతం మంది అన్ ఆర్గనైజ్డ్ రంగాల్లో ఉన్నారు.పార్లమెంట్ ని తీసుకున్నా అంత ఆశాజనకం గా ఏమీ లేదు. 542 మంది లోక్ సభ సభ్యుల్లో కేవలం 78 మంది మాత్రమే ఉన్నారు.అలాగే రాజ్యసభ లో తీసుకున్నా,224 మందికి గానూ 24 మంది మాత్రమే ఉన్నారు.ఇదంతా అక్టోబర్ 2021 లో తీసిన లెక్కలు.

అంతర్జాతీయ సంస్థలు ఈ గణాకాల పట్ల పెదవి విరుస్తున్నాయి. ఇంకా స్త్రీల శాతం అన్ని రంగాల్లో పెరగవలసిన అవసరాన్ని చెబుతున్నాయి.మనదేశం తో పోలిస్తే అనేక యూరపు దేశాల పరిస్థితి మిన్నగా ఉంది.అయితే ఎన్నో తరాల నుంచి వారికి,మన దేశ పరిస్థితికి తేడాలు ఉన్నాయి గదా అనవచ్చు.అదీ నిజమే అయినప్పటికి చిత్తశుద్ధి తో కృషి చేస్తే స్త్రీల శాతం అన్ని రంగాల్లో పెరిగే అవకాశం లేకపోలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి