Pages

10, అక్టోబర్ 2016, సోమవారం

తెలంగాణా ప్రభుత్వం చేసిన ఈ పనిని ఆంధ్ర ప్రదేశ్ చేసే వీలుందా..?


ఎట్టకేలకు బతుకమ్మ పండుగ ని రాష్ట్ర ప్రభుత్వ అధికార వేడుక గా ప్రకటించి తెలంగాణా లో ప్రతి ప్రభుత్వ కార్యాలయం లో ఇంకా ఇతర కార్యాలయాల లో జరిగేటట్లు చేసింది.కుల,మత ,వర్గ భేదాలు లేకుండా ఈసారి తెలంగాణా నలుమూలలా ఈసారి ఇవి జరిగాయి.ఆంధ్ర ప్రభావం ఎక్కువ గా ఉండి ఈ పండుగని  పెద్ద గా పట్టించుకోని ప్రాంతాల్లో సైతం పరిస్థితి మారిపోయి తప్పనిసరిగా బతుకమ్మ పండుగని చేసుకోవలసి వచ్చింది.ఆ విధంగా తెలంగాణా కి ఆత్మ లాంటి ఈ వేడుకని కెసీఅర్ ప్రభుత్వం పునరుజ్జీవింపజేసినట్లయింది.తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన లోను ఈ వేడుక ప్రజల్ని కలిసిగట్టు భావాన్ని ప్రొది జేసింది అనడం లో అతిశయోక్తి లేదు.ఇదే విధంగా ఒక సాంస్కృతిక ఐక్యత ని ఉద్దీపింప జేసే వేడుక ఆంధ్ర ప్రాంతం లో లేదా..ఉన్నా పెద్ద గా పట్టించుకోపోవడమా..?కోస్తా లోని సినిమా కల్చర్ లో సకల ఇతర విషయాలు  నిర్లక్ష్యం చేయబడటమే దీని వెనుకనున్న కారణమా..?

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

"జనతా గ్యారేజ్" సినిమా పై రివ్యూ



పర్యావరణ పరి రక్షణ ఒక వైపు, మంచి పనులు చేసే రౌడి గ్యాంగ్ మరో వైపు.ఈ రెండిటికి ప్రతినిధులు అయిన జూ.ఎన్ టి ఆర్ ఇంకా మోహన్ లాల్ లు కలుసుకొని ఇంకా సమాజ ఉద్ధరణ కొరకై నడుము  బిగించుట స్థూలంగా కధ ఇది.మధ్య లో కొన్ని రాజకీయాలు,బెదిరింపులు,పాటలు,పోరాటాలు,అలా సాగిపోతుంది.మొత్తం మీద చెప్పాలంటే సినిమా ఒక మాదిరి గా ఉంది.మరీ సూపర్ అని చెప్పలేము,బయట అనుకుంటున్నంత కోట్ల కలెక్షన్లు నిజంగానే కురుస్తున్నాయా..మరీ అంత లేదేమో..అనిపిస్తుంది.మోహన్ లాల్ మళయాళం లో  చేసే సినిమాలు చాలా వరకు వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమాలు,మన లాగా పెడ బొబ్బలు అవీ తక్కువ.అవసరం ఎంతో ఉంటే తప్ప. హీరోయిన్ లు ఉన్నారంటే ఉన్నారు అంతే.వాళ్ళ కి ప్రాధాన్యత తక్కువ.పాటలు ఒకటీ అర బాగున్నాయి. ఖాళీ ఉంటే ఒకసారి చూడదగ్గ సినిమా. 

28, ఆగస్టు 2016, ఆదివారం

పవన్ కళ్యాణ్ స్పందన వెనుక కారణాలు ఇంకా ఇతర విషయాలు......!


ఎందుకని ఉన్నట్టుండి ఒక ఇన్సిడెంట్ జరగగానే పవన్ కళ్యాణ్ స్పందించినట్లు..ఒక మీటింగ్ పెట్టడం..దాని ద్వారా కొంత మందికి కొన్ని సందేశాలు ఇవ్వడం.మర్డర్ అనేది మామూలు విషయం కాదు, అదీ అభిమానుల మధ్య.అసలు భారత దేశం మొత్తం లో ఇట్లా సినిమా హీరో ల విషయం లో  హత్యలకి తెగబడటం ఎక్కడా వినలేదు.అంత అనాగరిక  దశ లో తెలుగు సమాజం ఉంది.దీని వెనుక కొన్ని రాజకీయ కారణాలు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఒక వేళ ఈ సంఘటన కి గాని పవన్ గాని స్పందించక పోతే మిగతా అభిమానుల్లో కూడా బెరుకు ఏర్పడుతుంది.భయపడి ఎవడూ ముందుకు వచ్చే సాహసం చేయడు.దాని కోసమే మానసిక స్థయిర్యం కల్పించేందుకే పవన్  మీటింగ్ పెట్టి అనేకమందిని పరోక్షంగా తిట్టడం జరిగింది.

తెలుగు ప్రజల దరిద్రం ఏమిటంటే టాప్ డైలీస్ అనబడే దినపత్రికలు.ఈ రోజున సొషల్ మీడియా నే ఈ పత్రికల కంటే మెరుగైన 
 పాత్ర పోషిస్తున్నయి. అసలు చంద్ర బాబు ఒకందుకు సిగ్గు పడాలి...ఒక ముక్క తెగిపొయి అందరకి అసహ్యంగా కనిపిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ కి ..ముఖ్య మంత్రి అయినందుకు,కాని అది అంతా మరిచి సాధ్య మైనంత భూ కబ్జా రాజధాని పేరు మీద చేయడానికి తెగించడం అంటే తన తైనాతీ మీడియా మీద ఉన్న నమ్మకమే.


ఈ భూమి ని  దాచుకో ..దోచుకో ..అనే ప్రొగ్రాం కే ..మంట పుట్టి తెలాంగాణా ప్రజలు బాబు అండ్ కో ని తరిమి కొట్టింది.కాని మళ్ళీ ఇదే పాలసీ ని  సీమాంధ్ర లోను బాబు అమలు చేస్తున్నాడు. అదేమిటో గాని కోర్ట్ లు కూడా బాబు పట్ల ఉదాసీనత వహించడం చూస్తుంటే ..ఈ మేనేజ్ మేంట్ కళ లో బాబు బాగా ఆరితెరినట్లే కనిపిస్తోంది.పవన్ ఇచ్చిన కేంద్రం మీద వత్తిడి కార్యక్రమం ఎంతవరకు సఫలం అవుతుందో కాలమే చెప్పాలి.ఉద్యమాలు చేయడం అనేది తెలాంగాణా కే పరిమితం..ఆంధ్ర లో అంతా లౌక్యం,బల్ల కిందినుంచి నడిపించడం ఇవే కదా కనిపించేది.

31, జులై 2016, ఆదివారం

టూరిజం శాఖ లో రావలసిన మార్పులు...


వరంగల్ కి బెస్ట్ హెరిటేజ్ సిటి గా,ఇంకా ఓ కాఫీ టేబుల్ బుక్ కి కూడా సెంట్రల్ అవార్డ్ రావడం మంచిదే.మధ్య ప్రదేశ్ ,గుజరాత్ ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని గెలుచుకున్నాయి.ఒడిశా ,చత్తిస్ గడ్ లాంటి రాష్ట్రాల్లో కూడా రైలు స్టేషన్ ల లో మాత్రమే కాకుండా ప్రముఖ బస్ స్టేషన్ ల లో కూడా సిటీ సైట్ సీయింగ్ కి,ఇతర టూరిస్ట్ ప్యాకేజీల్ని బుక్ చేసుకోవచ్చును.అదేమిటో గాని మన హైదరా బాద్ లో సెంట్రల్ బస్ స్టేషన్ లో టూరిజం కౌంటర్ ఒక్కటీ లేకపోవడం వింతేనని చెప్పాలి.ఆ ఆఫీస్ కి ఫోన్ చేసినా సరైనా రెస్పాన్స్ ఉండదు.విజిటర్ దగ్గరకి మనం వెళ్ళాలి తప్ప వాళ్ళే చచ్చినట్లు వస్తారు అనుకునే ఆలోచనని వదులుకోవాలి.టూరిజం లో కొత్త పుంతలు తొక్కుతూ జనాల దగ్గరకి వెళ్ళడానికి దేశాలు ప్రయత్నిస్తుంటే ఇంకా సగటు ఉద్యోగి  మనస్తత్వాన్ని ప్రదర్శించే ధోరణి ని వదులుకోవాలి.ఆర్భాటంగా పబ్లిసిటి చేస్తే సరిపోదు...విజిటర్స్ ని ఇబ్బంది పెట్టకుండా సౌకర్యాల్ని కింది స్థాయికి తీసుకుపోవాలి.

23, జులై 2016, శనివారం

విదేశీ పెట్టుబడులు మీద శ్వేతపత్రం ప్రతి ఏటా ఎందుకు ప్రకటించరు..?

విదేశీ పెట్టుబడులు మీద శ్వేతపత్రం ప్రతి ఏటా ఎందుకు ప్రకటించరు..? మాట్లాడితే రాష్ట్రం బాగుపడాలంటే వేరే దేశాల కంపెనీలు పెట్టుబళ్ళు పెడితే తప్ప జరగదనే భావనకి ప్రజల్ని పాలకులు తీసుకొచ్చారు.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు గురించి చెప్పాల్సిన పని లేదు.రకరకాల విదేశీ వ్యక్తులతో ఫోటోలు మాత్రం పేపర్ల లో దండి గా వస్తున్నాయి.ఎన్ని కంపెనీలు ఇప్పటి దాకా వచ్చాయి,ఎంతమందికి దానివల్ల ఉద్యోగాలు దొరికాయి,రాష్ట్ర ప్రగతి లో వాటి వాటా ఎంత,వాటి కార్యకలాపాలు ఏమిటి..ఇవన్నీ ఎందుకు ప్రతి ఏటా ఎందుకు బహిరంగపరచరు..?ఇవి తెలుసుకునే హక్కు ప్రజలకి లేదా..?

ఇక రాజధాని ని ఫారిన్ కంపెనీలు తప్ప భారతీయులు కట్టలేరు అని చెప్పుకోవడం సిగ్గు చేటు కాదా..? ఇన్నాళ్ళ స్వాతంత్ర్యానికి ,మన ప్రభుత్వాలు ఇచ్చిన విద్య ఇదంతా కేవలం డొల్ల అని ఒప్పుకుంటున్నట్లేగా..?పాలన మాత్రం ఎందుకు...అది కూడా విదేశీయులకే కట్టబెడితే ఇంకా బాగా ఉంటుందిగా..అబ్బే అది మాత్రం మనకే కావాలి,అడ్డంగా దోచుకోవడానికి..!

10, జులై 2016, ఆదివారం

ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాల ల్లోకి రాకుండా అడ్డు పడేది వీరేనా..?


ప్రభుత్వం వారు ఇంగ్లీష్ మీడియం ని ప్రాధమిక స్థాయినుంచి పెడతాము అని అంటుంటే ఎందుకని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అని ఆలోచిస్తే దీని వెనుక కూడా కార్పోరేట్ స్కూల్ యాజమాన్యాల ప్రమేయం ఉన్నదేమో అనే అనుమానం వస్తోంది.ఎందుకంటే కొన్ని వందల కోట్ల వ్యాపారం ని ఇంగ్లీష్ చదువులు పేరు మీద పెద్ద విద్యా సంస్థలు ప్రతి ఏటా కొల్లగొడుతున్నాయి.అదే ఇంగ్లీష్ మీడియం ని గవర్నమెంట్ స్కూల్స్ లో పెడితే వాటిని చూసే వారు ఎవరుంటారు..? అందుకే తెలుగు ఎమోషన్ ని పైకి తెస్తూ ,సంస్క్రుతి నాశనం అవుతుందని అదని ఇదని కారణాలు చెబుతూ కొంత మంది అనుకూల వాదులు రెచ్చగొడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇంజనీరింగ్ గాని మెడిసిన్ గాని ఇంకే పై కోర్స్ గాని ఆంగ్లం లో నే నూటికి నూరు పాళ్ళు ఉంటున్నాయి.మరి వాటిని అన్నిటిని తెలుగు లోకి అనువదించే పని ఎందుకు చేయరు..?అదే విధంగా తెలుగు మీడియం అనేది లేకుండా కేవలం ఇంగ్లీష్ మీడియం లనే నడిపే కార్పోరేట్ విద్యా సంస్థల ముందు వీళ్ళు ఎందుకు బైఠాయించరు..?వాటిని ఎందుకు తీయించరు..?డబ్బు చెల్లించలేని పేద పిల్లలు ఎప్పటికీ తెలుగు మీడియమే చదవాలనేది వీరి అంతరంగమనుకుంటా..!!!

8, జులై 2016, శుక్రవారం

ఇది మహా ద్రోహం...మీరేమైనా అనండి..



ఒకప్పుడు పట్టించుకునేవాడిని కాదు గాని,ఈ మధ్య ఆలోచిస్తుంటే అనిపిస్తోంది. ఇది మరీ ఘోరమని.ఒక వ్యక్తి మీద నో,ఇంకో దాని మీద నో ఒక పేరు ఒక ఊరికి పెడతాము అయితే కాలం గడుస్తున్న కొద్ది ఆ పేరు మారి పోయి ఇంకోలా తయారవుతుంది.దానికి కారణం ఎవరు అంటే అర్ధ జ్ఞానం చేతనో, అలవి మాలిన సగం బ్రెయిన్ వల్ల నో కొంత మంది అలా ఉచ్చరిస్తారు.అదే ఒక తంతు లా సాగుతుంటుంది,లేకపోతే ఏమిటి హైదర్ జంగ్ అనే ఆయన మీద హైదరా బాద్ అనే పేరు పెట్టడం జరిగింది.ఇష్టం ఉన్నా లేకున్నా ఆ పేరు ని అలా ఉచ్చరించాలా లేదా..?దానికి బదులు గా కొంత మంది ఫేషన్ గా హైడ్రా బాడ్ అనో హైడెర్య బాద్ అనో పిలుస్తుంటే నాకైతే కాలుతుంది. ఈ మహానుభావులు అప్పుడే ఏ ఇతర గ్రహం నుంచో వచ్చినట్లుగా ఇక్కడి ఉచ్చారణలు తెలియనట్లు పోజు కొడుతుంటే వాళ్ళ మిడి మిడి జ్ఞానానికి   జాలి కలుగుతుంది.